Site icon PRASHNA AYUDHAM

ప్రభుత్వ ఆసుపత్రులలో పారిశుద్ధ్య సేవలు

IMG 20250616 WA01811

ప్రశ్న ఆయుధం న్యూస్ జూన్ 16
కొత్తగూడెం డివిజన్ ఆర్ సి
ఆసుపత్రిలో సేవలు మెరుగుపరచడానికి పారిశుద్ధ్య కార్మికుల శ్రమను తగ్గించడానికి కలెక్టర్ చొరవతో మిషన్ శానిటేషన్ ప్రారంభం.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ (జి జి హెచ్)లో పరిశుభ్రత మరియు పారిశుధ్య పనులను మరింత సులభతరం చేయడానికి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి పటేల్ వినూత్నమైన మెషిన్ శానిటేషన్ ఆలోచనను అందించారు. ఈ ఆలోచనను అమలు చేయడంలో భాగంగా, వెంటనే జిల్లా వైద్య అధికారి నిధుల ద్వారా మంజూరు కల్పించి, అవసరమైన యంత్రాలను పొందేందుకు చర్యలు తీసుకున్నారు.
ఇందులో భాగంగా క్రింది యంత్రాలను హాస్పిటల్‌కు అందించారు. స్క్రబ్బింగ్ మెషిన్మాన్యువల్ స్వీపర్ హై ప్రెషర్ వాషర్ఈ యంత్రాలు ఇటీవల హాస్పిటల్‌కు డెలివరీ అయ్యి, వినియోగానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకుని ప్రస్తుతం ఇవి ప్రత్యక్షంగా వినియోగంలోకి వచ్చాయి. దీంతో ఆసుపత్రిలో పారిశుధ్య ప్రమాణాలు మరింత మెరుగవుతాయి, కార్మికుల శ్రమ తగ్గుతుంది, మరియు రోగులకు శుభ్రమైన వాతావరణం అందుతుంది.ఈ సందర్భంలో కొత్తగూడెం జిల్లా ప్రజల తరఫున సూపరింటెండెంట్ మరియు కలెక్టర్ జితేష్ వి.పాటిల్ కు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు.ప్రజారోగ్యాన్ని కాపాడేందుకు ఆయన చూపిన చొరవ ప్రశంసనీయం అన్నారు.

Exit mobile version