Headlines in Telugu
-
చంద్రబాబు అరెస్ట్ పై సీఐడీ మాజీ చీఫ్ సంజయ్పై తీవ్రమైన ఆరోపణలు
-
సంజయ్ ఐపీఎస్ కేసులో విచారణ: అక్రమాలపై విజిలెన్స్ నివేదిక రెడీ
-
చంద్రబాబు అరెస్ట్పై టీడీపీ ఆగ్రహం; సంజయ్పై చర్యలు తప్పవా?
-
మిస్యూజ్ ఆరోపణలతో బలవంతపు విమర్శలు: మాజీ సీఐడీ చీఫ్ సంజయ్పై విజిలెన్స్ చర్యలు
*చంద్రబాబును అరెస్ట్ చేయడంలో అత్యుత్సాహం చూపిన ఆ ఐపీఎస్ చుట్టూ చక్రవ్యూహం..!*
చంద్రబాబు అరెస్ట్ సక్రమమేనని చెప్పే ప్రయత్నం చేశారని కూడి మండిపడుతున్నారు కూటమి నేతలు.
ఒక్కో వికెట్ పడుతోంది. సిచ్యువేషన్కు తగ్గట్లుగా బౌలింగ్ వేస్తోంది కూటమి సర్కార్. కట్ చేస్తే పక్కా ఎవిడెన్స్తో ఒక్కో ఆఫీసర్ను రౌండప్ చేస్తోంది. టార్గెట్ చేస్తే క్లీన్ బౌల్డ్ అవ్వాల్సిందేనన్నంత పక్కాగా విచారణ చేస్తోంది. దీంతో అందరి లెక్క తేలుతోంది. వరుసపెట్టి అక్రమాలు బోర్డుకు ఎక్కుతున్నాయి. అప్పటి అరాచకానికి ఇప్పుడు మూల్యం చెల్లించుకోక తప్పని పరిస్థితిని క్రియేట్ చేస్తోంది ఏపీ సర్కార్. గత ప్రభుత్వ హయాంలో అడ్డగోలుగా వ్యవహరించిన వారికి ఉచ్చు బిగిస్తోంది. ఇప్పుడు మాజీ సీఐడీ చీఫ్ సంజయ్ వంతు వచ్చింది. సార్ ఫైల్ రెడీ అయింది. యాక్షన్ మాత్రమే బాకీ ఉంది. లూప్లైన్లో ఉన్న ఆ అధికారిపై ఇంకేం చర్యలు ఉండబోతున్నాయ్.? కేసులు, విచారణలు తప్పవా.?
*తాము ఆలిండియా సర్వీస్ అధికారులమని మరిచిపోయారు..*
అధికారం ఉందని..అప్పటి బాస్ ఫ్రీ హ్యాండ్ ఇచ్చారని అడ్డగోలుగా వ్యవహరించారు. నాటి ప్రభుత్వ పెద్దలు చెప్పినట్లు నడుచుకున్నారు. వాళ్లు ఏది చెప్తే అది చేశారు. తాము ఆలిండియా సర్వీస్ అధికారులమని, తమకు ఓ రూల్ బుక్ ఉంటుందన్న విషయాన్ని మరిచిపోయారు. ఇలాంటి వారిలో సీఐడీ మాజీ చీఫ్ సంజయ్ కూడా ఒకరు. అందుకే కూటమి సర్కారు సంజయ్కి పోస్టింగ్ కూడా ఇవ్వకుండా లూప్లైన్లో పెట్టింది. ఇప్పటికే కొందరు అధికారులు విచారణ, కేసులు ఎదుర్కొంటుండగా.. ఇప్పుడు సంజయ్ వంతు వచ్చింది. పలు అక్రమాల్లో అడ్డంగా దొరికిపోయిన ఆయనపై యాక్షన్కు అంతా రెడీ అవుతోంది. సీఐడీ మాజీ చీఫ్, వివాదాస్పద IPS సంజయ్ అక్రమాల చిట్టా మామూలుగా లేదు. వివిధ శాఖల అధిపతిగా ఉన్నప్పుడు ఆయన వ్యవహరించిన తీరు..చేసిన అవినీతి, అక్రమాలు అన్నీ బయటికి వస్తున్నాయి.
*అధికార హోదాను అడ్డుపెట్టుకొని రూ.కోటి మిస్యూజ్..*
సంజయ్ ఫైర్ సేఫ్టీ డిపార్ట్మెంట్ డైరెక్టర్ జనరల్గా పని చేసినప్పుడు..అధికార హోదాను అడ్డుపెట్టుకొని కోటి రూపాయలు మిస్యూజ్ చేసినట్లు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం తేల్చింది. సౌత్రిక టెక్నాలజీస్ అండ్ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థతో కుమ్మకైనట్లు పనులు చేయకుండానే చెల్లింపులు చేశారట. బిడ్డింగ్లో రిగ్గింగ్ చేయడంతో పాటు టెండర్లు కట్టబెట్టడంలో రూల్స్ ఫాలో కాలేదని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ గుర్తించింది. రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక ఇచ్చి సంజయ్పై కేంద్ర సివిల్ సర్వీస్ రూల్స్ ప్రకారం యాక్షన్ తీసుకోవాలని సిఫార్సు చేసింది.
*కోటి రూపాయలలో ఖర్చు చేసింది 3 లక్షలే..!*
ఫైర్ సేఫ్టీ డిపార్ట్మెంట్లో ఐపాడ్లు, ల్యాప్టాప్ల కొనుగోళ్లలోనూ అక్రమాలే జరిగాయట. టెండర్లు, కాంపిటీటివ్ బిడ్లు లేకుండానే ఆర్డర్లు ఇచ్చేశారు. కనీసం బిల్లులూ సబ్మిట్ చేయలేదు. ఇలా అక్రమాల స్టోరీ మామూలుగా లేదట. వెబ్సైట్, మొబైల్ యాప్ డెవలప్మెంట్, ట్యాబ్ల సప్లై కోసం భారీగా బిల్లులు చెల్లించినట్లు తెలుస్తోంది. అంతే కాదు ఎస్సీ, ఎస్టీలకు చట్టాలపై అవగాహన కల్పిస్తానంటూ ఓ భారీ బాధ్యతల్లోకి దిగిపోయిన సంజయ్..నాటి జగన్ సర్కారు నుంచి ఏకంగా రూ.1 కోటిని విడుదల చేయించుకున్నారట. ఇందులో ఆయన కేవలం రూ.3 లక్షలు మాత్రమే ఖర్చు చేశారట.
*చంద్రబాబును అరెస్ట్ చేయడంలో అత్యుత్సాహం చూపించారని ఆగ్రహం..*
ఎన్. సంజయ్కి మొదట్లో మంచి పేరు ఉండేది. కానీ ఇప్పుడు విధి నిర్వహణలోనే తనదైన మార్కు అవినీతి అక్రమాలతో ఇరుక్కున్నారు. త్వరలో అరెస్ట్ అయ్యే అవకాశం ఉందంటున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే లూప్లైన్లో ఉన్న ఈ ఆఫీసర్ ఇక తన మిగిలిన సర్వీసును ఎలా ముగిస్తారన్న దానిపై సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. వైసీపీ అధికారంలో ఉండగా జగన్ దృష్టిని ఆకర్షించిన సంజయ్.. ఏకంగా సీఐడీ చీఫ్గా పదవి దక్కించుకున్నారు. స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబును అరెస్ట్ చేయడంలో సంజయ్ అత్యుత్సాహం చూపించారని టీడీపీ ఆగ్రహంతో ఉంది.
తర్వాత చంద్రబాబు అరెస్ట్ సక్రమమేనని చెప్పే ప్రయత్నం చేశారని కూడ మండిపడుతున్నారు కూటమి నేతలు. నాటి అడిషనల్ అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డితో కలిసి ఢిల్లీకి వెళ్లి అక్కడ మీడియా సమావేశం పెట్టడం టీడీపీకి ఆగ్రహం తెప్పించింది. ఈ క్రమంలోనే ఆయన అక్రమాలపై విజిలెన్స్ విచారణ చేయించింది. రిపోర్ట్ రెడీ అయింది. నెక్స్ట్ స్టెప్ ఏంటదన్నది ఉత్కంఠ రేపుతోంది.