సంగారెడ్డి జిల్లా ప్రతినిధి, నవంబర్ 23 (ప్రశ్న ఆయుధం న్యూస్): వైద్యుల నిర్లక్ష్యం కారణంగా వ్యక్తి మృతి చెందాడని బంధువులు కుటుంబీకులు ఎంఎన్ఆర్ ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగారు. బాధిత కుటుంబీకులు, బంధువులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. నర్సాపూర్ పట్టణానికి చెందిన కాశెట్టి సంతోష్ కుమార్ (44) గత 20 ఏళ్లుగా ఎంఎన్ఆర్ ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తున్నాడు. అయితే ఈ నెల 20 గురువారం సాయంత్రం తన విధులు నిర్వహించుకుని తిరిగి ఇంటికి వెళ్తుండగా.. హత్నూర పోలీస్ స్టేషన్ పరిధిలోని మంగాపూర్ గ్రామ శివారులో సంతోష్ బైక్ ను ఓ వ్యక్తి బైక్ ఎదురుగా వచ్చి ఢీ కొట్టాడు. ఈ ప్రమాదంలో సంతోష్ గాయాల పాలయ్యాడు. వెంటనే అతన్ని ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స చేయించి, సంతోష్ విధులు నిర్వర్తిస్తున్న ఎంఎన్ఆర్ ఆసుపత్రిలో చేరాడు. అయితే అక్కడ చికిత్స పొందుతూ శనివారం సాయంత్రం మృతి చెందాడు. సంతోష్ కు ఆసుపత్రిలో సరైన చికిత్స అందకపోవడంతోనే మరణించాడని బాధిత కుటుంబీకులు, బంధువులు ఎంఎన్ఆర్ ఆసుపత్రి ముందు ఆందోళన చేపట్టారు. యాజమాన్యం శనివారం రాత్రి స్పందించి ఆదివారం ఉదయం మాట్లాడిన న్యాయం చేస్తామని హామీ ఇచ్చి ఆదివారం ఉదయాన్నే భారీగా పోలీసులను మోహరించారని బాధ్యత కుటుంబ సభ్యులు ఆందోళన చేశారు. ఆసుపత్రి నిర్లక్ష్యం వల్లే సంతోష్ ప్రాణాలు కోల్పోయాడని తమకు న్యాయం చేయాలని ఆసుపత్రి వద్ద బైటాయించారు. ఆస్పత్రి వద్ద భారీగా పోలీసులు మోహరించారు.
వైద్యుల నిర్లక్ష్యం… సంతోష్ మృతి.. బంధువుల ఆందోళన
Published On: November 23, 2025 12:27 pm