నేడు స్వాతంత్ర్య సమరయోధుడు, దేశ మాజీ ఉప ప్రధాని సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ జయంతి

మాజీ
Headline:
సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ జయంతి సందర్భంగా మంత్రి కొండా సురేఖ పుష్పాంజలి ఘటించారు

నేడు స్వాతంత్ర్య సమరయోధుడు, దేశ మాజీ ఉప ప్రధాని సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ జయంతి (అక్టోబర్ 31-జాతీయ ఐక్యత దినోత్సవం) ని పురస్కరించుకుని అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖామాత్యులు శ్రీమతి కొండా సురేఖ గారు హైదరాబాద్ లోని వారి నివాసంలో సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి, నివాళులు అర్పించారు. స్వాతంత్య్రం సిద్ధించిన తర్వాత దేశాన్ని సంఘటితం చేయడంలో వల్లభ్ భాయ్ పటేల్ ప్రదర్శించిన తెగువ, ధైర్య సాహసాలు అసమాన్యమైనవని మంత్రి సురేఖ అన్నారు. పటేల్ స్ఫూర్తితో దేశ అఖండతను, సార్వభౌమత్వాన్ని కాపాడేందుకు ప్రతి పౌరుడు కృషి చేయాలని మంత్రి పిలుపునిచ్చారు.

Join WhatsApp

Join Now