Site icon PRASHNA AYUDHAM

సైనికుడు సుఖదేవ్ శరణ్ అభినందన సభలో పాల్గొన్న సత్యం శ్రీరంగం.

IMG 20250622 WA2287

సైనికుడు సుఖదేవ్ శరణ్ అభినందన సభలో పాల్గొన్న

సత్యం శ్రీరంగం.

ప్రశ్న ఆయుధం జూన్ 22: కూకట్‌పల్లి ప్రతినిధి

” సిందూర్ మెరుపు దాడులతో పాకిస్తాన్ ను తోకముడిచేలా చేసిన ఘనత మన సైనిక దళాలదే – సత్యం శ్రీరంగం. ”

” భారత సైనికులు ఆపరేషన్ సిందూర్ పేరుతో పాకిస్తాన్ పై చేసిన దాడులపై ప్రజలందరూ గర్వించారు – సత్యం శ్రీరంగం.

కూకట్ పల్లి నియోజకవర్గం బాలానగర్ డివిజన్ ఫిరోజ్ గూడలో భారత వాయుసేనలో ఆపరేషన్ సిందూర్ లో పాల్గొని తిరిగి తన స్వగృహానికి చేరుకున్న సార్జెంట్ రాపోలు సుఖదేవ్ శరణ్ సైనికుడుగా క్రియాశీలక పాత్ర పోషినందుకు అభినందిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిధిగా టీపీసీసీ అధికార ప్రతినిధి సత్యం శ్రీరంగం హాజరై సార్జెంట్ రాపోలు సుఖదేవ్ శరణ్, వారి కుటుంబ సభ్యులను అభినదించి, సన్మానించారు. ఈ సందర్బంగా సత్యం శ్రీరంగం మాట్లాడుతూ రాపోలు శ్రీనివాస్ భాగ్య దంపతుల ప్రధమ పుత్రుడు సార్జెంట్ రాపోలు సుఖదేవ్ శరణ్ సైన్యంలో పని చేస్తూ భారత వాయుసేనలో ఆపరేషన్ సిందూర్ లో భాగంగా సార్జెంట్ రాపోలు సుఖదేవ్ శరణ్ ప్రత్యక్షంగా యుద్ధంలో పాల్గొని 140 కోట్ల భారతీయుల కోసం చేసిన పోరాటంలో తన ధైర్య సాహసాలను మరవలేమని అన్నారు. ఉగ్రవాదులను ప్రేరిపిస్తున్న పాకిస్తాన్ కు బుద్ది చెప్పేందుకు భారత్ సైనికులు ఆపరేషన్ సిందూర్ పేరుతో ఆ దేశం పై చేసిన దాడులపై దేశ ప్రజలందరూ గర్వించారు అని అన్నారు. భారత సైనికులు తమ ప్రాణాలు పణంగా పెట్టి పోరాడారని, సిందూర్ సైన్యానికి సెల్యూట్ అన్నారు. ప్రతిపక్ష కాంగ్రెస్ రాజకీయాలకు అతీతంగా కేంద్ర ప్రభుత్వానికి మద్దతుగా నిలిచిందన్నారు. ఈ కార్యక్రమంలో ఎఎంసి చైర్మన్ పుష్పా రెడ్డి, బి బ్లాక్ అధ్యక్షులు తూము వేణు, పులి శ్రీకాంత్ పటేల్, పులి శివ కుమార్ గౌడ్, శ్రీకాంత్ గౌడ్, సదా గౌడ్, రవి గౌడ్, మధుమోహన్, హేమంత్, మధుమోహన్, జిల్లా శివ, సోషల్ మీడియా కోఆర్డినేటర్ శేఖర్ గజానంద్, సోను, సత్తి గౌడ్, ప్రశాంత్, శ్రీనివాస్, ఆర్ఎం సురేష్, మనోజ్, రవి ముదిరాజ్, అనిల్, సత్య పాల్, తుకారం, రవి పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ నాయకులు, స్థానిక కాలనీ పెద్దలు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Exit mobile version