Headlines :
-
చంద్రుగొండ తాసిహల్దార్ కు ఎస్సీ కులాల హక్కులపై వినతి
-
షెడ్యూల్డ్ కులాల హక్కుల పోరాట సమితి చైతన్య యాత్ర ప్రారంభం
-
ఇంటివిల్లు లేని పేదలకు రాయితీ, హక్కు పత్రాల కోసం వినతి పత్రం
-
ఎస్సీ కులాల రిజర్వేషన్ పెంచేందుకు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్
ప్రశ్న ఆయుధం న్యూస్ డిసెంబర్ 7 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆర్ సి
షెడ్యూల్డ్ కులాల హక్కుల పోరాట సమితి తెలంగాణ రాష్ట్ర కమిటీ అనుమతి మేరకు చండ్రుగొండ మండలంలో శనివారం చైతన్య యాత్ర కార్యక్రమం ఆ సంఘం రాష్ట్ర కోఆర్డినేటర్ ఎనగంటి కృపాకర్ చేపట్టారు.ఏజెన్సీ ప్రాంత ఎస్సీ కులాల స్థానిక సమస్యలపై పోరాటానికి సిద్ధం కావాలన్నారు. ఇల్లు లేని పేదలకు ఇందిరమ్మ ఇల్లు దరఖాస్తులు,ఇంటి స్థలం లేని నిరుపేదలకు ఇంటి స్థలం కోసం దరఖాస్తు,భూమి ఉoడి హక్కు పత్రం లేని వారికి హక్కు పత్రం కోసం దరఖాస్తులు అందజేయడానికి చంద్రుగొండ మండల తాసిహల్దార్ కు ఈనెల13 న వినతి పత్రం అందజేసే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఎస్సీ కులాల నాయకులు పార్టీలకు, సంఘాలకు అతీతంగా ఈ ప్రాంత హక్కుల కోసం పాల్గొనాలని కోరారు.ఈ కార్యక్రమానికి షెడ్యూల్డ్ కులాల హక్కుల పోరాట సమితి (ఎస్సీ హెచ్ పి ఎస్) వ్యవస్థాపక అధ్యక్షులు బొమ్మెర శ్రీనివాస్ ముఖ్యఅతిథిగా పాల్గొంటారని వెల్లడించారు.తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఎస్సీ కులాల స్థానిక జడ్పిటిసి,ఎంపీటీసీ తొలగించిన ఎస్సీ రిజర్వేషన్ తిరిగి అమలు చేయాలని,తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఎస్సీ కులాల జనాభా పెరిగినందున ఎస్సీ కులాల రిజర్వేషన్ 20% పెంచాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో చండ్రుగొండ మాజీ ఎంపీటీసీ చాపలమడుగు లక్ష్మణ్ రావు, లాలయ్య, పరదేశి లక్ష్మణరావు, కాకాటి కిరణ్, నాగేశ్వరరావు, నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.