మహిళపై కామాంధుడు అత్యాచారం, సీసీ కెమెరాలో రికార్డ్ అయిన దృశ్యాలు ..

మహిళపై కామాంధుడు అత్యాచారం,

సీసీ కెమెరాలో రికార్డ్ అయిన దృశ్యాలు ..

IMG 20240828 WA0028

సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ పట్టణంలోని రాయిపల్లి రోడ్డులో వైన్స్ సమీపంలోని ఓ దుకాణం ఎదుట సోమవారం రాత్రి 11 గంటల 45 నిమిషాలకు ఓ దళిత మహిళపై మోయిన్ అనే మైనారిటీ యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ మహిళ కొంత మతిస్థిమితం లేనికారణంగా అటూ ఇటూ తిరుగుతూ ఉంటుంది. దీంతో అర్థరాత్రి వేళ ఆ మహిళ ను గమనించిన మోయిన్ రేప్ చేసేందుకు పన్నాగం పన్నాడు. మహిళ ఎంత గింజుకున్నప్పటికీ బలవంతంగా అత్యాచారం చేసేందుకు ప్రయత్నించాడు. గట్టిగా మహిళ ను నెట్టివేసి అత్యాచారం చేశాడు. ఈ ఘటనకు సంబంధించి సీసీ కెమెరాలో దృశ్యాలు రికార్డ్ కావడం జరిగింది . మంగళవారం సాయంత్రం కొందరు స్థానికులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి నిందితుడిని రిమాండ్ కు తరలించనున్నట్లు నారాయణఖేడ్ డి.ఎస్.పి వెంకటరెడ్డి తెలిపారు. అర్థరాత్రి దళిత మహిళపై అత్యాచారానికి పాల్పడిన కామాంధుడిని కఠినంగా శిక్షించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

Join WhatsApp

Join Now