*ప్రశాంత్ కిశోర్ పార్టీకి ఎన్నికల గుర్తుగా ‘స్కూల్ బ్యాగ్’*
ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ స్థాపించిన ‘జన్ సురాజ్’ పార్టీకి ఎలక్షన్స్ కమిషన్ గుర్తును కేటాయించింది. ‘స్కూల్ బ్యాగ్’ గుర్తుపై బిహార్లోని 243 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆ పార్టీ బరిలోకి దిగనుంది. గత ఏడాది అక్టోబర్ 2న ప్రశాంత్ కిశోర్ ఈ పార్టీని స్థాపించగా, 8 నెలల తర్వాత ఈసీ గుర్తును కేటాయించింది. షెడ్యూల్ ప్రకారం బిహార్ ఎలక్షన్స్ ఈ ఏడాది అక్టోబర్, నవంబర్లో జరగాల్సి ఉంది.