Site icon PRASHNA AYUDHAM

బాలసదన్‌ ను తనిఖీ చేసిన జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి

IMG 20251009 210920

Oplus_131072

సంగారెడ్డి జిల్లా ప్రతినిధి, అక్టోబర్ 9 (ప్రశ్న ఆయుధం న్యూస్): జాతీయ న్యాయ సేవాధికార సంస్థ, రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.భవానిచంద్ర ఆదేశాల ప్రకారం గురువారం సంగారెడ్డి బాలసదన్‌ ను జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి.సౌజన్య తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పిల్లలందరికీ చట్టాలపై అవగాహన కలిగి ఉండటం చాలా అవసరమని సూచించారు. విద్యార్థులు క్రమశిక్షణతో ఉండి, చదువులో ప్రగతి సాధించాలన్నారు. ఉపాధ్యాయులు విద్యార్థుల పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపుతూ, వారి బాగోగులు చూసుకోవాలని సూచించారు. అలాగే పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ద్వారా ఆరోగ్యకరమైన వాతావరణం ఏర్పడుతుందని తెలిపారు. విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించి, జీవితంలో ఉన్నత స్థాయికి చేరాలని ప్రోత్సహించారు. విద్యార్థులు, ఉపాధ్యాయులకు అవసరమైన ఉచిత న్యాయ సహాయం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ద్వారా అందుబాటులో ఉంటుందని, ఎవరికైనా న్యాయ సహాయం అవసరమైతే, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యాలయాన్ని సంప్రదించవచ్చని తెలిపారు.

Exit mobile version