కంది సెంట్రల్ జైలును తనిఖీ చేసిన జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి

సంగారెడ్డి ప్రతినిధి, జూలై 4 (ప్రశ్న ఆయుధం న్యూస్): జాతీయ న్యాయ సేవాధికార సంస్థ, రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ హైదరాబాద్ ఆదేశాల ప్రకారం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి గారి సుచనలతో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి.సౌజన్య సెంట్రల్ జైలు కందిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ తనిఖీలో న్యాయమూర్తి సెంట్రల్ జైలులో ఉన్న బెరక్లూ, గదులు, వంట గది, మరియు బాత్రూంలు జైలు ఆవరణ మొత్తం తిరిగి పరిశీలించి ఖైదీలను జైలులో ఉన్న సదుపాయాలను, భోజనం గురించి అడిగి తెలుసుకున్నారు. అన్ని ఖైదీలు బెరక్లూ క్షుణ్ణంగా పరిశీలించి వారికీ కావాల్సిన అవసరాలు, సదుపాయాలు అన్ని అందించేలా చూడాలని జైలు సూపరింటెండెంట్ కు తెలియజేశారు. ఖైదీలతో వారికీ సమయానికి బైల్స్, ములాఖత్ అందుతున్నాయా, కేసులు పరిష్కరించేందుకు న్యాయ సేవలు పొందేందుకు ఉచితంగా న్యాయవాదిని నియమిస్తామని ఖైదీలకు తెలియపరిచారు. ఖైదీలకు పెడుతున్న భోజనం రుచి చూడడం జరిగింది. ఖైదీల కోసం వండే కూరగాయలు, బియ్యం, ఉన్న రూమ్ ను కూడా తనిఖీ చేశారు. జైల్లో ఉన్న లీగల్ ఎయిడ్ క్లినిక్ కూడా పరిశీలించారు. వీరి వెంట జైలు సిబ్బంది తదితరులు ఉన్నారు.

Join WhatsApp

Join Now