*జంఝావతి లిఫ్ట్ పనిచేసేలా చూడండి…!*
*ట్రాన్స్ ఫార్మర్ మరమ్మతులకు నిధులు చెల్లించండి
*లిఫ్ట్ కాలువ ద్వారా 12 వేల ఎకరాలకు సాగునీరు ఇవ్వండి*
*మోటార్లకు కరెంటు సమస్య పరిష్కరించలేని దుస్థితిలో ప్రభుత్వం
*జంఝావతి విషయంలో వైసిపి, కూటమి ప్రభుత్వాలు విఫలం*
*కాంగ్రెస్ పాలనలో రైతులకు ఇచ్చిన వరం జంఝావతి రబ్బరు డ్యామ్
*ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జంధ్యావతి లిఫ్ట్ కాలువ ద్వారా మీరు ఇవ్వాలని కోరిన కాంగ్రెస్ పార్టీ నాయకులు*
పార్వతిపురం మన్యం జిల్లా ప్రతినిధి జూన్ 24( ప్రశ్న ఆయుధం న్యూస్) దత్తమహేశ్వరరావు
పార్వతీపురం:
పార్వతీపురం మన్యం జిల్లాలోని కొమరాడ మండలంలో గల జంఝావతి ప్రాజెక్ట్ రబ్రిడాం లిఫ్ట్ పనిచేసేలా చర్యలు తీసుకోవాలని భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ నాయకులు కోరారు. సోమవారం కాంగ్రెస్ పార్టీ ఓబీసీ జిల్లా చైర్మన్ వంగల దాలి నాయుడు, నియోజకవర్గ చైర్మన్ సిరిసిపల్లి సాయి శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాలక రంజిత్ కుమార్ తదితరులు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి కే. హేమలతతో జంఝావతి ప్రాజెక్టు సమస్యలపై చర్చించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రస్తుతం ఖరీఫ్ పనులు ప్రారంభం అయ్యాయని, నైరుతి పవనాలు మందగించినట్లు కనిపిస్తున్నాయన్నారు. కాబట్టి ఈ ఏడాది రైతులకు జంఝావతి సాగునీరు తప్పనిసరిగా అవసరం కానుందన్నారు. కాబట్టి జంఝావతి ప్రాజెక్టును వేధిస్తున్న సమస్యలను పరిష్కరించి రబ్బరు డ్యాం, లిఫ్ట్ కాలువ ద్వారా పూర్తిస్థాయి 24,640 ఎకరాలకు సాగునీరు అందవ్వాలని కోరారు. ఈ మేరకు గత కొంతకాలంగా రబ్బరు డ్యాం లిఫ్ట్ పనిచేయడం లేదని అన్నారు. ట్రాన్స్ఫార్మర్ మరమ్మతులకు గురికావడం వల్ల లిఫ్ట్ పని చేయడం లేదన్నారు. మరమ్మత్తులు కావలసిన నిధులు చెల్లించకపోవడం వల్ల లిఫ్ట్ పడకేసిందన్నారు. తక్షణమే నిధులను విడుదల చేసి లిఫ్ట్ మరమ్మత్తులు పూర్తిచేసి సాగు నిరందివ్వాలన్నారు. లిఫ్ట్ కెనాల్ ద్వారా 12000 ఎకరాలకు, రబ్రిడ్డం ద్వారా 12000 ఎకరాలకు పూర్తిస్థాయిలో సాగునీరు ఇవ్వాలన్నారు. ఈ సందర్భంగా జిల్లా రెవెన్యూ అధికారి కె. హేమలత కు వినతిపత్రాన్ని అందజేశారు. దీనికి స్పందించిన ఆమె సంబంధిత శాఖ అధికారులతో చర్చించి తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ జంఝావతి రబ్బరు డ్యామ్ లిఫ్ట్ కు ఉన్న కరెంటు సమస్య పరిష్కరించలేని దుస్థితిలో ప్రభుత్వం ఉందన్నారు. రైతు ప్రభుత్వం అని గొప్పలు చెప్పుకోవడమే తప్ప రైతుల సమస్యలు పరిష్కరించడం లేదని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ పాలనలో అప్పటి ముఖ్యమంత్రి దివంగత నేత డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి రైతులకు జంజారతి రబ్బర్ డ్యాం ను వరంగా అందించారన్నారు. దాన్ని వైసిపి, కూటమి పాలకులు భద్రంగా చూసుకునేందుకు శ్రద్ధ కనపరచలేదన్నారు. జంఝావతీ సమస్య పరిష్కారంలో రబ్బర్ డ్యాం లిఫ్ట్ ద్వారా రైతుకు సాగునీరు అందించే విషయంలో అటువైసీపీ ఇటు కూటమి ప్రభుత్వాలు వైఫల్యం చెందాయన్నారు. తక్షణమే లిఫ్ట్ కెనాల్ కు అవసరమైన విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ కు చెల్లించాల్సిన బకాయి సుమారు తొమ్మిది లక్షల రూపాయలు లిఫ్ట్ అందుబాటులోకి తెచ్చి రైతులకు ఈ ఖరీఫ్ కు సాగునీరు అందివ్వాలని కోరారు. ఓట్లేసిన రైతులకు న్యాయం చేయాలని కోరారు.