అంతరాలు లేని సమాజాన్ని నిర్మించాలి.

అంతరాలు
Headlines
  1. అంతరాలు లేని సమాజం కోసం సీతక్క పిలుపు
  2. గ్రామీణ ప్రాంత అభివృద్ధి కోసం స్వచ్ఛంద సంస్థల కృషి అవసరం
  3. ములుగు జిల్లాలో స్వచ్ఛంద సంస్థలతో మంత్రి సీతక్క సమావేశం
  4. సీ ఎస్ ఆర్ నిధులతో గ్రామాలకు మౌలిక సదుపాయాల కల్పన
  5. గిరిజన ప్రాంతాల అభివృద్ధి కోసం స్వచ్ఛంద సంస్థలతో చర్చలు
స్వచ్ఛంద సంస్థలు మారుమూల గ్రామాలకు తరలి రావాలి. 

రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా శిశు సంక్షేమ శాఖల మంత్రి దనసరి అనసూయ సీతక్క.

అంతరాలు లేని సమాజాన్ని నిర్మించాలని, స్వచ్ఛంద సంస్థలు గ్రామీణ ప్రాంతాలకు తరలివచ్చి గ్రామీణ అభివృద్ధిలో తోడ్పడాలని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి గ్రామీణ నీటి సరఫరా మహిళా శిశు సంక్షేమ శాఖ ల మంత్రి దనసరి అనసూయ సీతక్క అన్నారు. 

శనివారం గోవిందరావుపేట మండలం బుస్సాపూర్ గ్రామం లోని లక్నవరం లో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా శిశు సంక్షేమ శాఖల మంత్రి దనసరి అనసూయ సీతక్క, జిల్లా కలెక్టర్ దివాకర టి. ఎస్. తో కలసి నిర్మాణ్ సంస్థ నేతృత్వం లో జిల్లా కు విచ్చేసిన 50 కార్పొరేట్ సంస్థల ప్రతినిధుల బృందం సభ్యులతో సమావేశమయ్యారు.

ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ అంతరాలు లేని సమాజాన్ని ఏర్పాటు చేయాలని స్వచ్ఛంద సంస్థలు గ్రామాల అభివృద్ధి పై ప్రత్యేక దృష్టి పెట్టాలని అన్నారు. అనేక స్వచ్ఛంద సంస్థలు కేవలం నగరాల చుట్టూ ఉన్న ప్రాంతాల అభివృద్ధి వైపే మొగ్గు చూపుతున్నారని నిజానికి స్వచ్ఛంద సంస్థల అవసరం ములుగు జిల్లా లాంటి మార్ముల ప్రాంతాలకు ఎంతో అవసరం ఉందని ఈ సందర్భంగానే ములుగు ప్రాంత అభివృద్ధిలో స్వచ్ఛంద సంస్థలు పాలు పంచుకోవాలని పిలుపునిచ్చారు.

స్వచ్ఛంద సంస్థలు గ్రామీణ ప్రాంతాలకు రావడం ద్వారా ఒక విభిన్నమైన వాతావరణం ఏర్పడుతుందని దీని ద్వారా గ్రామాలు త్వరితగతిన అభివృద్ధి చెందే అవకాశం ఉందని అన్నారు.

స్వచ్ఛంద సంస్థలు మారుమూల ప్రాంతాలపై దృష్టి పెట్టడం వల్ల వెనుకబడిన ప్రాంతాలు ఏ విధంగా అభివృద్ధి వైపు తీసుకువెళ్లాలో స్థానిక యువతకు ఎలాంటి నైపుణ్య శిక్షణ అందించాలో మహిళలకు ఎలాంటి ఉపాధి అవకాశాలు కల్పించాలో అనే పలు చర్చించే అవకాశం ఉంటుందని అన్నారు. ఒకొక్క సంస్థ ఒక గ్రామానికి దత్తత తీసుకొని సి ఎస్ ఆర్ నిధులతో అభివృద్ది చేయాలని మంత్రి కోరారు.

ములుగు ప్రాంతానికి వచ్చిన స్వచ్ఛంద సంస్థలకు జిల్లా యంత్రాంగం నుంచి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించడం జరుగుతుందని గిరిజన ప్రాంతాలలో మౌలిక సదుపాయాల కల్పన ఎంతో అవసరం ఉందని అన్నారు.

జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ స్థానిక మంత్రి సీతక్క చొరవతో మల్టీ నేషనల్ కంపెనీలు గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి ముందుకు వచ్చాయని , స్వచ్ఛంద సంస్థలు గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి పాటుపడాలని అన్నారు. గ్రామీణ ప్రాంతాలలో ప్రజలకు ఎలాంటి సౌకర్యాలు కల్పించాలో స్వచ్ఛంద సంస్థలకు అర్థమయ్యే రీతిలో వివరించడం ద్వారా వాటి ఆచరణ అమలు కార్యక్రమాలను స్వచ్ఛంద సంస్థలు పరిశీలించిన, గ్రామాల అభివృద్ధికి దోహదపడతాయని పేర్కొన్నారు.

నిర్మాన్ సంస్థ సి ఈ ఓ మయూర్ మాట్లాడుతూ స్థానిక మంత్రి ప్రత్యేక శ్రద్ధతో అనేక స్వచ్ఛంద సంస్థలను గ్రామీణ ప్రాంతాలకు తరలిరావాలని వారి సేవలు గిరిజన ప్రాంతాలకు ఎంతో అవసరం ఉందని గుర్తించి మాలాంటి స్వచ్ఛంద సంస్థలకు ఆహ్వానం అందించారని తెలిపారు. దీనిలో భాగంగానే అనేక స్వచ్ఛంద సంస్థలు రాంనగర్ గ్రామపంచాయతీ పరిధిలోని ఎల్బీనగర్, మాన్య తండా రాంనగర్ హబిటేషన్లలో పరిశీలించి , ఒక అధ్యయనం చేసి ఇక్కడ స్థానిక యువతకు మహిళలకు ప్రజలకు ఎలాంటి అవసరాలు ఉన్నాయి అనే అంశాలను పూర్తిస్థాయిలో పరిశీలించి ముఖ్యంగా పాఠశాలలలో మౌలిక సదుపాయాలు స్థానిక యువతకు నైపుణ్యం శిక్షణ తరగతులు అందించి ఉపాధి కల్పించడం జరుగుతుందని తెలిపారు.

అంతకుముందు గోవిందరావు పేట మండలం లోని రామ్ నగర్ గ్రామ పంచాయితీ, పరిదిలోని ఎల్ బి నగర్, మాన్య తండా లలో 

జిల్లా కలెక్టర్ దివాకర టి. ఎస్.,

కార్పొరేట్ సంస్థల ప్రతినిధులతొ కలసి గ్రామ సభలలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా గ్రామము లో కల్పించవలసిన అవసరాలు, ప్రజలకు కావలసిన సౌకర్యాలను గ్రామస్తులు అర్జీల ద్వారా తెలిపారు.

కార్పొరేట్ సంస్థల ప్రతినిధులు గ్రామములలోనీ వీధులను సందర్శించారు.

ఈ కార్యక్రమములో నిర్మాన్ సంస్థ, ఇతర కార్పోరేట్ సంస్థల ప్రతినిధులు, తహసిల్దార్ సృజన్ కుమార్, ఎంపిడిఓ జవహర్ రెడ్డి, 

ఎంపిఓ శరత్, పంచాయితి సెక్రటరీ స్వర్ణ, తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now