ఫుట్బాల్ పోటీలకు అల్ఫోర్స్ విద్యార్థుల ఎంపిక

*రాష్ట్రస్థాయి ఎస్ జి ఎఫ్ ఫుట్బాల్ పోటీలకు ఆల్ఫోర్స్ విద్యార్థులు ఎంపిక*

*హర్షం వ్యక్తం చేసిన ఆల్ఫోర్స్ విద్యాసంస్థల చైర్మన్ నరేందర్ రెడ్డి*

 

*కరీంనగర్ అక్టోబర్ 16 (ప్రశ్న ఆయుధం)*

 

రాష్ట్రస్థాయిలో నిర్వహించే యస్.జి.యఫ్ ఫుట్బాల్ క్రీడా పోటీలకు అల్ఫోర్స్ విద్యార్థులు ఎంపిక కావడం ఆ విద్యార్థులకు ఆల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డాక్టర్ వి నరేందర్ రెడ్డి ప్రత్యేక అభినందనలు తెలిపారు నరేందర్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులకు చదువుతోపాటు క్రీడలు తప్పనిసరి అని క్రీడలతో మానసిక ఉల్లాసం ఏర్పడుతుందని దానివలన చదువులో ముందుకు సాగుతారని క్రీడల వల్ల శారీర దృఢత్వం ఏర్పడుతుందని ఆరోగ్యమైన శరీరం ఏర్పడుతుందని ప్రతి పనిలో విజయాలను సులభంగా పొందవచ్చని అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డా వి. నరేందర్ రెడ్డి స్థానిక కొత్తపల్లిలోని అల్ఫోర్స్ ఇ-టెక్నో స్కూల్కు ఏర్పాటుచేసిన సమావేశంలో అన్నారు రాష్ట్రస్థాయి ఎస్ జి ఎఫ్ క్రీడా పోటీలకు ఎంపికైన విద్యార్థులను ప్రత్యేకంగా అభినందిస్తూ మునుముందు ఎన్నో విజయాలు సాధించాలని పట్టుదలతో అంకితభావంతో నేర్పుతో ఆటలాడాలని సూచించారు విద్యార్థులకు విద్యతో పాటు వివిధ క్రీడలపట్ల ఆసక్తిని పెంచాలని వారికి కావాల్సిన వనరులను కల్పించడం ద్వారా ఉజ్వలమైన భవిష్యతు పునాది వేసిన వారవుతారని పలు రకాల క్రీడలను నిర్వహించడమే కాకుండా వాటిని సరైన రీతిలో ఆడేలాగా విద్యార్థులకు తెలియజేయాలని వ్యాయామ ఉపాధ్యాయులకు కోరారు విద్యార్థులకు ప్రాథమిక దశనుండే వివిధ క్రీడల పోటీల గురించి తెలియజేయాలని కోరారు గత కాలంలో కరీంనగర్ జిల్లాలో నిర్వహించినటువంటి జిల్లా స్థాయి పోటీలలో పాఠశాలకు చెందినటువంటి అండర్ 17 బాలుర విభాగంలో యస్. అశ్వత్, 10వ తరగతి ఖాజా మోహినుద్దీన్ అహ్మద్, 10వ తరగతి, కె. రిషి, 8వ తరగతి విద్యార్థులు అండర్ 17 బాలికల విభాగంలో సహస్ర, 9వ తరగతి, అనన్య 9వ తరగతి లు విశేష ప్రతిభ కనబర్చి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికవడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్, వ్యాయామ ఉపాధ్యాయలు విద్యార్థులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now