దివ్యాంగులకు సహాయ ఉపకరణాలు ఎంపిక కార్యక్రమం
జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ ఆదేశాల ప్రకారం జిల్లా సంక్షేమ శాఖ అధికారి ఆద్వర్యంలో అర్టిఫిషియల్ లింబ్ మాన్యుఫ్యాక్షరింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వారి సహాకారంతో జిల్లా నందు నాలుగు రోజుల దివ్యాంగులకు సహాయ ఉపకరణాలు ఎంపిక కార్యక్రమంలో భాగంగా ఈ రోజు మండల పరిషత్ కార్యాలయము- భద్రాచలం నందు దివ్యాంగుల సహాయ ఉపకరణాల ఎంపిక శిబిరము నిర్వహించడం జరిగింది. ఈ శిబిరంలో 126 మంది దివ్యాంగులను బ్యాటరీ ట్రైసైకిల్స్, ట్రైసైకిల్స్, వీల్ చైర్స్, వినికిడి యంత్రాలు, ఆంథుల చేతికర్రలు మరియు కృత్రిమ అవయవాలు, చంకకర్రలు కొరకు ఎంపిక చేయడం జరిగింది. ఈ సహాయ ఉపకరణాలు ఆలింకో నుండి అందిన వెంటనే పంపిణీ చేయబడును. నేటి ఎంపిక శిబిరానికి హాజరు కాలేని వారు రేపు ఐ.డి.ఓ.సీ.కార్యాలయం పాల్వంచ నందు జరిగే దివ్యాంగుల ఎంపిక శిబిరానికి హాజరు కావొచ్చును. ఈ కార్యక్రమంలో యం.పి.డి.ఓ. ఈ.ఓ. శ్రీనివాస్, సీ.డి.పి.ఓ. నవ్య శ్రీ, అలింకో సిబ్బంది రష్మి రంజాన్ శెట్టి, అభిషేక్ ద్వివేది, సూపర్వైజర్స్ సౌమ్య, అనసూర్య, రాజేశ్వరి, వర ప్రసాద్, నరేష్, ప్రవీణ్, అంగన్వాడి టీచర్లు, దివ్యాంగులు పాల్గొన్నారు.