ఓయమ్మ నా పల్లె సీమ కోసం గాయనీ, గాయకుల ఎంపిక. నూతన కళాకారులకు గొప్ప అవకాశం.

ఓయమ్మ నా పల్లె సీమ కోసం గాయనీ, గాయకుల ఎంపిక. నూతన కళాకారులకు గొప్ప అవకాశం.

నిజామాబాద్ (ప్రశ్న ఆయుధం ) జిల్లా ప్రతినిధి డిసెంబర్ 28

నూతన కళాకారులకు గొప్ప అవకాశం అని, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా కళాకారులు సద్వినియోగం చేసుకోవాలని

నూరేండ్ల నాఊరు కళానేతలు అష్ట గంగాధర్, రెలారే గంగా, నరాల సుధాకర్ అన్నారు. శనివారం నగరంలోని కేర్ డిగ్రీ కళాశాలలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..ప్రముఖ ప్రజా కవి గాయకులు వరంగల్ శ్రీనివాస్ రచించిన నూరేండ్ల నా ఊరు గేయకావ్యం ఓయమ్మ నా పల్లెసీమ కోసం గాయనీ గాయకుల ఎంపిక కార్యక్రమం డిసెంబర్ 30 న సోమవారం ఉదయం 10 గంటల నుంచి జిల్లా కేంద్రంలోని

IMG 20241228 WA0092

అంబేద్కర్ భవన్ నిర్వహించడం జరుగుతుందన్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుండి ఆసక్తి ఉన్న గాయనీ గాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొని మీ ప్రతిభతో ఈ గేయ కావ్యంలో పాడే అవకాశాన్ని దక్కించుకోవాలన్నారు.243 చరణాలు కలిగిన ఈ గేయకావ్యంలో 243 మంది ప్రతిభావంతులైన గాయనీ గాయకులచే పాడించాలని గొప్ప నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో నూరేండ్ల నాఊరు కళానేతలు అష్ట గంగాధర్, రెలారే గంగా, నరాల సుధాకర్, రాంపూర్ సాయి, సాయి లవోల, కర్క రమేష్ (వాడి), లక్క క్రాంతి, సవిత,దివ్య , మహేందర్, సంతోష్, లు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now