Site icon PRASHNA AYUDHAM

తీవ్రంగా ‘డ్రగ్స్‌’ వ్యతిరేకంగా – జెఎన్‌టియుహెచ్లో సూపరింటెండెంట్ అభిష్ చక్రబర్తి సందేశం

IMG 20250617 213103

తీవ్రంగా ‘డ్రగ్స్‌’ వ్యతిరేకంగా – జెఎన్‌టియుహెచ్లో సూపరింటెండెంట్ అభిష్ చక్రబర్తి సందేశం

ప్రశ్న ఆయుధం జూన్ 17: కూకట్‌పల్లి ప్రతినిధి

జవాహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ హైదరాబాద్ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ సైన్స్ అండ్ టెక్నాలజీ హైదరాబాద్ ఆధ్వర్యంలో జూన్ 20, 2025న జరగనున్న అంతర్జాతీయ మాదకద్రవ్యాల దుర్వినియోగం మరియు అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవంను పురస్కరించుకొని జూన్ 17, 2025న ఉదయం 10:00 గంటలకు జెఎన్‌టియుహెచ్ యుజిసి ఆడిటోరియంలో ‘మాదకద్రవ్య వినియోగ వ్యతిరేక అవగాహన కార్యక్రమం’ నిర్వహించబడింది.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో, హైదరాబాద్ జోన్‌కు చెందిన సూపరింటెండెంట్ అభిష్ చక్రబర్తి విద్యార్థులను ఉద్దేశించి మాదకద్రవ్య వినియోగం వల్ల కలిగే దుష్ప్రభావాలపై ప్రసంగించారు. శారీరక ఆరోగ్య సమస్యలు, అవయవాల డ్యామేజ్, రోగనిరోధక శక్తి తగ్గిపోవడం, మానసిక సమస్యలు, మూడ్ స్వింగ్‌లు, సామాజికంగా ఒంటరితనం, ఉద్యోగం లేదా విద్యా నష్టాలు, చట్టపరమైన శిక్షలు (జైలు శిక్ష, జరిమానాలు), ఆర్థిక స్థిరతపై ప్రతికూల ప్రభావం తదితర అంశాలపై ఆయన వివరంగా చర్చించారు. కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు మాదకద్రవ్యల బానిసల పట్ల చూపుతున్న మద్దతు వ్యవస్థను కూడా ఆయన వివరించారు.

కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ జి.వి. నరసింహారెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ, అంతర్జాతీయ సరిహద్దుల్లో జరుగుతున్న నార్కోటిక్స్ వ్యాపారంపై విద్యార్థులకు అవగాహన కల్పించాలన్నారు. మాదకద్రవ్యాల సరఫరాను నియంత్రించడంలో ఎదురయ్యే సవాళ్లను గురించి కూడా ఆయన ప్రస్తావించారు. “డ్రగ్స్‌కి ‘నో’ చెప్పండి” అనే సందేశాన్ని ఆయన అందించారు.

కార్యక్రమంలో విద్యార్థులు చురుకుగా పాల్గొని అనేక ప్రశ్నలను అడిగారు. విద్యార్థులు అడిగిన సందేహాలను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో, హైదరాబాద్ జోన్‌కి చెందిన ఇన్‌స్పెక్టర్ మిస్టర్ అనిల్ స్పష్టంగా సమాధానించారు.

ఈ కార్యక్రమాన్ని సిఆర్‌సి ఛైర్‌పర్సన్ ప్రొఫెసర్ వి. పార్వతి సమన్వయం చేశారు. కార్యక్రమంలో డా. ఎన్.వి.ఎస్.ఎన్. లక్ష్మి, హెడ్, హ్యూమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్ తో పాటు పలువురు అధ్యాపకులు, ఉద్యోగులు పాల్గొన్నారు.

Exit mobile version