బింగి స్వామి టి జే యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
ప్రశ్న ఆయుధం హైదరాబాద్
మహాన్యూస్ పై బిఅరెస్ నాయకుల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నానని టి జే యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తెలిపారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో నిజానిర్దారణలను బయట పెట్టడానికి పోలీస్ వ్యవస్థ న్యాయ వ్యవస్థ ఉందని, వాటినన్నింటిని పక్కన పెట్టి చట్టాన్ని చేతిలోకి తీసుకొని దాడులు చేయడం సరైన విధానం కాదని అన్నారు. మీడియా వ్యవస్థలు అన్ని ఒక్క తాటిపైకి వచ్చినప్పుడే ఇలాంటి దాడులు జరగవని అన్నారు. ఇప్పటికైనా మీడియా వ్యవస్థలు, జర్నలిస్టులు ఏకమై పోరాటం చేయాలని పిలుపునిచ్చారు.
మహాన్యూస్ పై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాము
by Naddi Sai
Published On: June 28, 2025 9:13 pm
