వెదురు సాగు పై అవగాహన కల్పించాలి : సెర్ప్ ఫార్మా డైరెక్టర్ రజిత.

ప్రశ్న ఆయుధం న్యూస్ ఏప్రిల్ 19

కొత్తగూడెం డివిజన్ ఆర్ సి

జిల్లాలో వెదురు సాగుపై రైతులకు అవగాహన కల్పించి, వెదురు సాగు చేపట్టే విధంగా చర్యలు తీసుకోవాలని సెర్ప్ ఫార్మా డైరెక్టర్ రజిత అన్నారు. శనివారం ఐడిఓసి కార్యాలయం సమావేశం మందిరంలో జిల్లాలోని ఉమెన్ ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్, సీఈవోలు, జిల్లా సమాఖ్య సభ్యులు మరియు ఏపీఎం లతో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యాచందనతో కలిసి సెర్ప్ ఫార్మా డైరెక్టర్ రజిత సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సమావేశంలో భాగంగా 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు జరిగిన మిర్చి కొనుగోలు వివరాలను డైరెక్టర్ రజిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఎఫ్ పీసీల ద్వారా ఇప్పటివరకు సుమారు ఒక కోటి రూపాయల టర్నోవర్ చేశారని ఇంకా టర్నోవర్ పెంచాలని అధికారులకు సూచించారు. గుండాల ములకలపల్లి మరియు చండ్రుగొండ మండలంలో వెదురు రైతులకు గుర్తింపు మరియు ఆన్లైన్ నందు డేటా ఎంట్రీ గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు.జిల్లాలో రైతులకు వెదురు సాగు వల్ల కలిగే లాభాలు గురించి అవగాహన కల్పించాలని సూచించారు.సమీకృత వ్యవసాయం గురించి రైతులకు అవగాహన కల్పించాలని, నాచురల్ ఫార్మింగ్ సీఆర్పీల పనితీరు పై ఈ సమావేశంలో చర్చించారు.మునగ సాగు మరియు మునగాకుల సేకరణ గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు.

ఈ సమావేశంలో ఎఫ్ పి సి కోఆర్డినేటర్ శ్రీనివాస్,టిపిఎం ఫార్మా వెంకయ్య మరియు సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now