ఎస్బిఐ ప్రాంతీయ కార్యాలయంలో రక్తదాన శిబిరం ఏర్పాటు 

ఎస్బిఐ ప్రాంతీయ కార్యాలయంలో రక్తదాన శిబిరం ఏర్పాటు

కామారెడ్డి జిల్లా ప్రతినిధి

(ప్రశ్న ఆయుధం) జూన్ 23

ఎస్బిఐ రీజనల్ కామారెడ్డి జిల్లా వారి ఆధ్వర్యంలో కామారెడ్డి జిల్లా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సహకారంతో నేడు ఎస్బిఐ ప్రాంతీయ కార్యాలయంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడమైనది. ఈ శిబిరాన్ని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వన్ ప్రారంభించారు. ఎస్బిఐ 71 వార్షికోత్సవ సందర్భంగా వందమందికి పైగా రక్తదానం చేస్తున్నందుకు కలెక్టర్ అభినందించారు .రక్తదానం మహాదానమని ఆపదలో ఉండి రక్తం అవసరమున్నవారికి మనమందరం ముందుకు వచ్చి రక్తదానం చేయాలని ముఖ్యంగా యువత రక్త దానం చేయాలని పిలుపునిచ్చారు.ఈరోజు రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో బాన్సువాడలో కూడా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడమైనది.

ఈ కార్యక్రమంలో కామారెడ్డి రీజనల్ మేనేజర్ జి. వెంకటేశ్వర్లు, జిల్లా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ రాజన్న , మేనేజర్ హెచ్ ఆర్ రమణ మిగతా ఎస్బిఐ అధికారులు, సిబ్బంది బ్లడ్ బ్యాంక్ సిబ్బంది హాజరైనారు.

Join WhatsApp

Join Now

Leave a Comment