Site icon PRASHNA AYUDHAM

ఎస్టీ కార్పొరేషన్ సబ్సిడీ నిధులను చేయాలి: సేవాలాల్ సేన జిల్లా అధ్యక్షుడు గుగులోత్ భద్రు నాయక్

IMG 20241218 WA0252

ఎస్టీ కార్పొరేషన్ సబ్సిడీ నిధులు విడుదల చేయాలని ITDA, APO డేవిడ్ రాజు గారిని కలిసి వినతిపత్రం ఇవ్వడం జరిగింది.2020 ఆర్థిక సంవత్సరానికి అప్పట్లో ఆన్లైన్ ఇచ్చి లబ్ధిదారుల ఎంపిక జరిగింది కానీ 2024 ఆర్థిక సంవత్సరం ముగుస్తున్న ఇప్పటికీ సబ్సిడీ నిధులు రీలీజ్ కాలేదు. ఏళ్లు గడుస్తున్న సబ్సిడీ రాకపోవడం చాలా బాధాకరం. గిరిజనులు అభివృద్ధి చెందాలని ఉద్దేశంతో పెట్టారు. ఈ స్కీం కి సబ్సిడీ నిధుల త్వరగా రిలీజ్ చేయాలని గిరిజనులు వేడుకుంటున్నారు. చెక్ నెంబర్లు జనరేట్ అయి ఏళ్లు గడుస్తున్న కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం సంవత్సర కాలం గడిచింది దీని మీద శ్రద్ధ వహించి సబ్సిడీ నిధులను త్వరగా విడుదల చేయాలని సేవాలాల్ సేన విద్యార్థి రాష్ట్ర ఉపాధ్యక్షుడు ANS ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జిల్లా నాయకులు నునవత్ రాజా, బానోత్ రమేష్ తదితరులు పాల్గొన్నారు.

Exit mobile version