ఘటనలో ఏడుగురు మృతి..

IMG 20241016 WA0097

మెదక్‌ జిల్లా శివ్వంపేట మండలం ఉసిరికపల్లి వద్ద బుధవారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు అదుపుతప్పి కాల్వలోకి దూసుకెళ్లిన ఘటనలో ఏడుగురు మృతి చెందారు. రహదారిపై గుంతల వల్ల కారు అదుపు తప్పి కల్వర్టును ఢీకొంది. ఆ తర్వాత ఎగిరి పక్కనే ఉన్న కాల్వలో పడింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న ఏడుగురు నీటమునిగి అక్కడికక్కడే మృతి చెందారు. నామ్‌సింగ్‌ భార్య శాంతి (38), కుమార్తె మమత (12) సీతారాంతండాకు చెందిన అనిత (35), హిందూ (13), శ్రావణి (12).. తలపల్లితండాకు చెందిన శివరాం (56), దుర్గి (45) ఘటనలో ప్రాణాలు కోల్పోయారు. డ్రైవింగ్‌ చేస్తున్న నామ్‌సింగ్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ఒకే కుటుంబానికి చెందిన వీరంతా తూప్రాన్ దగ్గర ముత్యాలమ్మ గ్రామ దేవత ఆలయానికి వెళ్లి వస్తుండగా ప్రమాదం జరిగింది. మృతదేహాలను తుప్రాన్‌ ఆస్పత్రికి తరలించారు.

సీఎం రేవంత్‌ దిగ్ర్భాంతి..

ఈ ఘటనపై స్పందించిన ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. అధికారులతో మాట్లాడి ప్రమాద వివరాలను అడిగి తెలుసుకున్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య చికిత్స, అవసరమైన సాయం అందించాలన్నారు.

Join WhatsApp

Join Now