*వరంగల్*
ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో నగరవాసులు ఫ్రూట్ జ్యూస్ లు తాగుతున్నారా తస్మాత్ జాగ్రత్త…
నగరంలో పలు జ్యూస్ సెంటర్లలో వెలుగు చూసిన దారుణాలు..
కుళ్ళిన పళ్ళతో పళ్ళ రసాలను తయారు చేస్తున్న కొంతమంది జ్యూస్ పాయింట్ వ్యాపారు..
రంగంలోకి టాస్క్ ఫోర్స్..
టాస్క్ఫోర్స్ దాడుల్లో భయంకర విషపదార్థాలతో జ్యూస్ తయారీ చేస్తున్న హనుమకొండ నగరంలోని బరిష్ట జ్యూస్ పాయింట్ తో పాటు కొన్ని జ్యూస్ పాయింట్స్ లను గుర్తించిన ఫుడ్ సేఫ్టీ, టాస్క్ ఫోర్స్ అధికారులు..
విష రసాయనాలతో పళ్ళు కుళ్ళిపోకుండా నిల్వ ఉంచడమే కాకుండా, పళ్ళ రసాలు రంగు మారకుండా రుచిని తలపించేందుకు విష రసాయనాలను వాడుతున్నట్లు గుర్తించిన ఫుడ్ సేఫ్టీ అధికారులు..
బరిష్ట జ్యూస్ పాయింట్ లో వెలుగు చూసిన దారుణాలు..
19 రకాల సుమారు 21,420 రూపాయల విలువ గల ఫ్రూట్ జ్యూస్ ఉత్పత్తులను స్వాధీన పరుచుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు..
నాణ్యత పరిశుభ్రత ప్రమాణాలు పాటించకుండా ప్రజల ఆరోగ్యాలతో చలగాటమాడుతున్న వ్యాపారుల పట్ల కఠినంగా వ్యవహరించాలని సదరు వ్యాపారులపై కేసులు సైతం నమోదు చేయాలని ఆదేశాలుగా జారీచేసిన వరంగల్ సిపి సన్ ప్రీత్ సింగ్..