Headlines
-
ఎస్ఎఫ్ఐ బంద్: నవంబర్ 30న ప్రభుత్వ పాఠశాలలు మూత
-
పుడ్ ఫాయిజన్ ఘటనలపై నిర్లక్ష్యం – ఎస్ఎఫ్ఐ తీవ్ర ఆందోళన
-
విద్యార్థుల ఆరోగ్యం విషయంలో ప్రభుత్వం విఫలం
-
విద్యాశాఖ మంత్రి నియామకం కోసం ఎస్ఎఫ్ఐ డిమాండ్
-
గురుకులాల పరిస్థితిపై సమీక్ష చేయాలని ఎస్ఎఫ్ఐ హెచ్చరిక
ఈ నెల 30న పుడ్ ఫాయిజన్ ఘటనలు పై ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసనగా ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల బంద్:
హైదరాబాద్: రాష్ట్రంలో వరుసగా పుడ్ ఫాయిజన్ ఘటనలు జరుగుతున్న రాష్ట్ర ప్రభుత్వం స్పందించడం లేదు. ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోవడం లేదు. విద్యార్థులు చనిపోతున్న అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు.పాఠశాలలు, సంక్షేమ వసతిగృహాలు,గురుకులాలు సమస్యలతో సతమతం అవుతున్నాయి. రక్షణ కరువై, పర్యవేక్షణ లేకుండా పోతున్నాయి. రాష్ట్రంలో ముఖ్యమైన విద్యారంగానికి మంత్రి లేకుండానే 1 సంవత్సరం గడిచిపోతుంది. ఈ సమస్యలు పై కనీసం సమీక్ష చేసే పరిస్థితి రాష్ట్రంలో లేకుండా పోయింది. అందుకే ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా ఈనెల 30న ప్రభుత్వ పాఠశాలల బంద్ ఎస్ఎఫ్ఐ నిర్వహిస్తుంది. తక్షణమే ముఖ్యమంత్రి విద్యాశాఖ, వసతిగృహాలు,గురుకులాలు, కెజిబివిలపై రివ్యూ చేసి , సమస్యలు పరిష్కారం చేయాలని ఎస్ఎఫ్ఐ కోరుతుంది. విద్యాశాఖ మంత్రి ని నియమించాలని డిమాండ్ చేస్తోంది. లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఈ సమస్యపై ఎస్ఎఫ్ఐ పోరాడుతుంది. 30న రాష్ట్ర వ్యాప్తంగా బంద్ జయప్రదం చేయాలని ఎస్ఎఫ్ఐ పిలుపునిస్తుంది.
ఆర్.ఎల్.మూర్తి, రాష్ట్ర అధ్యక్షుడు
టి.నాగరాజు, రాష్ట్ర కార్యదర్శి