ప్రశ్న ఆయుధం న్యూస్ డిసెంబర్ 15 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆర్ సి
పాల్వంచ పట్టణం, పేట చెరువు గ్రామానికి చెందిన సిపిఐ సీనియర్ నాయకులు, కొత్తగూడెం నియోజకవర్గ మాజీ రైతు సంఘం (ఏ ఐ కే స్) అధ్యక్షులు వెల్లంకి నాగభూషణం అనారోగ్యంతో వారి స్వహగ్రహంలో మృతి చెందారు. సీపీఐ జిల్లా కార్యదర్శి కా.ఎస్ కె సాబీర్ పాషా, జిల్లా కార్యవర్గసభ్యులు కా.ముత్యాల విశ్వనాధం, కా.చంద్రగిరి శ్రీనివాసరావు, కా.సలిగంటి శ్రీనివాస్, జిల్లా సమితి సభ్యులు కా. వి.పూర్ణచందర్ రావు తదితరులు మృతదేహంపై పార్టీ జెండాను కప్పి, పూలమాలవేసి ఘన నివాళులర్పించారు. కుటుంబసభ్యులకు సానుభూతి ప్రకటించారు.
నాగభూషణం పార్థివ దేహాన్నికి షాబీర్ పాష సంతాపం తెలిపారు
