ప్రశ్న ఆయుధం న్యూస్ మే 22 కొత్తగూడెం డివిజన్ ఆర్ సి
దిశ ఉమెన్ ప్రొటెక్షన్ వెల్ఫేర్ ఫౌండేషన్ కార్యాలయాన్ని సిపిఐ పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి ఎస్.కె షాబీర్ పాషా గురువారం ప్రారంభించి మాట్లాడారు.దిశా కమిటీని ఏర్పాటు చేసుకోవడం వలన మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలకు ఇక్కడ పరిష్కార మార్గం దొరుకుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.దిశ ఉమెన్ ప్రొటెక్షన్ వెల్ఫేర్ ఫౌండేషన్ ఫౌండర్ ప్రెసిడెంట్ వాసర్ల నాగమణి,దిశ జిల్లా కమిటీ ప్రెసిడెంట్ దీప్తినాగేందర్ న్యాయవాది, డిస్టిక్ వైస్ ప్రెసిడెంట్ కనుకుంట్ల రాములమ్మ,జనరల్ సెక్రెటరీ ఎట్టే పెళ్లి మాధవిలత,అనంత లక్ష్మి,రమాదేవి,గౌరవ సలహాదారుగా బొమ్మెర శ్రీనివాస్ మరి కొంతమందిని కమిటీ ఎంపిక చేసుకోవడంసంతోష కరమని
అభినందించారు.సింగరేణి హెడ్ ఆఫీస్ ఏరియాలో కార్యాలయాన్ని ప్రారంభించిన సందర్భంగా దిశ కమిటీ ప్రెసిడెంట్ వాసర్ల నాగమణి మాట్లాడారు మహిళల పట్ల ఎటువంటి అగత్యాలు,అన్యాయాలు జరిగిన వారికి అండదండగా నిలబడి మహిళల శక్తిని చూపించాలని దీమా వ్యక్తం చేశారు.ఈ కమిటీ కొత్తగూడెం జిల్లాకు పరిమితం కాకుండా రాష్ట్రం మొత్తం విస్తరింప చేస్తామని
తెలియజేశారు.కార్యక్రమానికి న్యాయవాది మల్లెల ఉషారాణి, బుద్దిస్ట్ సొసైటీ ఆర్గనైజేషన్ జిల్లా ప్రెసిడెంట్ కొచ్చర్ల రాణి, పానుగంటి విజయమ్మ,పాల్గొని కమిటీని అభినందించారు.దిశా కమిటీ భద్రాచలం నియోజకవర్గం ఇన్చార్జి నాగుల కుసుమ, మణుగూరు మండల ప్రెసిడెంట్ రమాదేవి,అశ్వాపురం మండల ఇన్చార్జి కూటల దుర్గ,ఎగ్జిక్యూటివ్ నెంబర్ జక్కుల సుశీల,
గౌరవసలహాదారు సయ్యద్ సర్వర్,కొత్తగూడెం టౌన్ ప్రెసిడెంట్ మహమ్మద్ అమీన్, వైస్ ప్రెసిడెంట్ గుగులోతు కవిత, తదితరులు పాల్గొన్నారు.
దిశ కమిటీ కార్యాలయాన్ని ప్రారంభించిన షాబీర్ పాషా దిశ కమిటీ ఫౌండర్ ప్రెసిడెంట్ వాసర్ల నాగమణి
by Naddi Sai
Published On: May 22, 2025 7:01 pm
