*TS EAMCET లో షాద్ నగర్ విజ్ఞాన్ కాలేజ్ విద్యార్థిని చందనకు 1500 టాప్ ర్యాంక్*
ఈరోజు విడుదలైన తెలంగాణ ఎంసెట్ ఫలితాల్లో షాద్ నగర్ విజ్ఞాన్ జూనియర్ కాలేజ్ విద్యార్థిని ఆర్. చందన 1500 టాప్ ర్యాంకు సాధించి తన ప్రతిభను చాటారు. బైపీసీ రెండవ సంవత్సరం చదువుతున్న చందన ఈ విజయానికి కాలేజ్ యాజమాన్యం హర్షం వ్యక్తం చేసి ఆమెను ప్రత్యేకంగా అభినందించి స్వీట్లు తినిపించారు.
ఈ సందర్భంగా మాట్లాడిన చందన “నాకు ఈ ర్యాంక్ రావడానికి నిరంతరంగా ప్రోత్సహించిన నా విద్యాప్రతిష్టానం మరియు అధ్యాపక బృందానికి మరియు ప్రిన్సిపాల్ వి.విశ్వనాథ్ కు నా ప్రత్యేక ధన్యవాదాలు,” అంటూ చెప్పారు.
విద్యార్థులకు ఉత్తమ విద్యను అందించడంలో షాద్ నగర్ విజ్ఞాన్ కాలేజ్ మరోసారి తమ కృషిని రుజువు చేసుకుంది.