Site icon PRASHNA AYUDHAM

అంబేద్కర్ కు అవమానం.

IMG 20241029 WA0227 1

– ధ్వంసం అవుతున్న పట్టించుకోని అధికారులు.

– ఇతర నాయకులకు జరిగితే ఇలానే ఊరుకుంటారా….

– జిల్లా కలెక్టర్ స్పందించండి.

ప్రపంచ మేధావి, భారత రాజ్యాంగ నిర్మాత, బాబాసాహెబ్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహం భద్రాచలం పట్టణంలో ప్రతిరోజు అవమానానికి గురవుతూనే ఉంది. రహదారులు, ఫుట్ పాత్ లు ఆక్రమించి వ్యాపారాలు నిర్వహిస్తుంటుంటే. మరోపక్క వాహనాల రద్దీ పెరిగి ఇసుక లారీలు, ఇతర భారీ వాహనాలు తిరగడం వలన అంబేద్కర్ విగ్రహా గోడలకు తలగడం వలన పూర్తిగా ధ్వంసం అవుతుంది. అనేకమంది అధికారులకు, ప్రజా ప్రతినిధులకు ఎన్నిసార్లు విన్నవించిన ఫలితం లేకుండా పోతుంది. ఇతర నాయకుల విగ్రహాలకు ఇదే విధంగా జరిగితే అధికారులు చూస్తూ ఊరుకుంటారా అనేది ప్రశ్నార్థకంగా మారింది. గత సంవత్సరం ఎన్నికలకు ముందు అంబేద్కర్ కాంస్య విగ్రహాన్ని తీసుకువచ్చి ఇప్పటివరకు ముసుగు తీయకుండా ఉన్నారంటే ప్రపంచ మేధావికి ఎంత అవమానం జరుగుతుందో అర్థం చేసుకోవచ్చు. త్వరలో అంబేద్కర్ విగ్రహం కూడా పూర్తిగా కనుమరుగ అయ్యే పరిస్థితి నెలకొంది. తక్షణమే జిల్లా కలెక్టర్ స్పందించి అంబేద్కర్ సర్కిల్ ను పెద్దగా చేసి కాంస్య విగ్రహాన్ని ప్రతిష్టించే విధంగా చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.

Exit mobile version