Site icon PRASHNA AYUDHAM

గొర్రెల సంతలో అదనంగా 10 రూపాయల వసూలు 

IMG 20250508 WA0008

గొర్రెల సంతలో అదనంగా 10 రూపాయల వసూలు

– పట్టించుకోని మున్సిపల్ శాఖ అధికారులు

ప్రశ్న ఆయుధం – కామారెడ్డి

ప్రతి గురువారం కామారెడ్డి జిల్లా కేంద్రంలో గొర్రెల, మేకల సంత కొనసాగుతోంది. ఇందు గాను మున్సిపల్ కార్యాలయం నుండి తైబాజర్ పేరుతో వేలం వేసి కూరగాయలకు, మేకలకు, పట్టణానికి వచ్చి పోయే వాహనాలకు వేలం వేసి కాంట్రాక్టర్లకు అప్పగిస్తుంది. అందులో భాగంగా ఒక్కొక్క గొర్రె కు మున్సిపల్ తీర్మానం ప్రకారం 40 రూపాయలు తీసుకోవాల్సి ఉండగా సదర్ కాంట్రాక్టర్ మాత్రం తన ఇష్ట రాజ్యంగా అదనంగా 10 రూపాయలు తీసుకుంటున్నారని గొర్రె, మేకల కొనుగోలుదారులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు స్పందించి తైబాజర్ కాంటాక్ట్ల పై దృష్టి సారించాలని పట్టణ ప్రజల కోరుతున్నారు.

Exit mobile version