టి పి సి సి ప్రెసిడెంట్ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ని కలిసి దసరా శుభాకాంక్షలు తెలియజేసిన శిరీష సత్తూర్
ప్రశ్న ఆయుధం అక్టోబర్ 11: కూకట్పల్లి ప్రతినిధి
దసరా పండుగ సందర్భంగా శేర్లింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ శిరీష సత్తూర్ టి పి సి సి ప్రెసిడెంట్ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ని మర్యాదపూర్వకంగా కలిసి దసరా శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ దసరా పండుగ ప్రజలందరికి ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు, అష్టైశ్వర్యాలు కలిగేలా ఉండాలని ఆమె కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆమె సోదరుడు ఈవూరు సుజిత్ కుమార్, మధు, గాయత్రి తదితరులు పాల్గొన్నారు.