*అంబులెన్స్ సదుపాయం కల్పించాలి
బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు గంధం మల్లికార్జున రావు
ప్రశ్న ఆయుధం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతి నిధి అక్టోబర్ 17
పాల్వంచ పట్టణ పరిధిలోని ప్రభుత్వ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ నందు వైద్యుల,సిబ్బంది కొరత తీర్చాలని బహుజన్ సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షుడు గంధం మల్లికార్జున రావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.గురువారం పార్టీ శ్రేణులతో కలిసి ప్రభుత్వ సామాజిక ఆరోగ్య కేంద్రం ఎదుట ప్లకార్డులతో నిరసన తెలిపారు.ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ సామాజిక ఆరోగ్య కేంద్రంలో సి-ఎఆర్ఏం మిషన్,డిజిటల్ ఎక్సెరే మిషన్ లేకపోవడంతో ప్రమాదాలు జరిగి ఎముకల సమస్య వస్తే ప్రైవేట్ లో పరీక్షలు చేపించుకునే ఆర్థిక స్థోమత లేక ప్రజలు ఆర్దిక ఇబ్బందులు పడుతున్నారని,అదేవిదంగా సరిపడ వైద్యులు లేక ఉన్న వైద్యులు సమయానికి రాక రోగులు గంటల తరబడి ఆసుపత్రిలో పడిగాపులు కాస్తున్నారని,రోజుకు 600 మందికి పైగా ఔట్ పేషెంట్లు వచ్చే ఆసుపత్రికి కేవలం 50 బెడ్లు మాత్రమే ఉండటం వల్ల భద్రాచలం,కొత్తగూడెం లకు పంపాల్సి వస్తుందని,ఫ్రీజర్ బాక్స్ ల సదుపాయం కల్పించాలని,లక్ష ముపై వేల జనాభా ఉన్న పాల్వంచలో ప్రభుత్వ ఆసుపత్రికి అంబులెన్స్ సదుపాయం లేకపోవడంతో అత్యవసర సేవలకు ఆసుపత్రికి రావాలన్నా,ఆసుపత్రి నుంచి మెరుగైన వైద్యం కోసం వేరే ప్రాంతాలకు వెళ్ళాలన్న నానా ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.డయాలసిస్ కేంద్రాన్ని ప్రారంభించి చేతులు దులుపుకొకుండా సరిపడా సిబ్బందిని నియమించాలని,మందుల కొరత తీర్చాలని డిమాండ్ చేశారు.ప్రభుత్వం తక్షణమే స్పందించి వైద్యుల,సిబ్బంది కొరతను,తీర్చి అంబులెన్స్ సదుపాయం కల్పించాలని కోరారు.
ఈకార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు కోళ్ళపూడి ప్రవీణ్ కుమార్,టంగు శ్రీనివాస్,కటికల రంజిత్,నాగరాజు,రమేష్,రాముతదితరులు పాల్గొన్నారు.