Site icon PRASHNA AYUDHAM

వర్షాకాలంలో వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి

IMG 20250626 WA2554

*వర్షాకాలంలో వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి*

*ప్రాథమిక ఆరోగ్య కేంద్రం హెల్త్ ఎడ్యుకేటర్ మోహన్ రెడ్డి*

*జమ్మికుంట జూన్ 26 ప్రశ్న ఆయుధం*                                            వర్షాకాలంలో సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని అందులో ముఖ్యంగా అతి సార వ్యాధి అప్రమత్తంగా ఉండాలని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం హెల్త్ ఎడ్యుకేటర్ మోహన్ రెడ్డి అన్నారు గురువారం రోజున కరీంనగర్ జిల్లా కలెక్టర్,జిల్లా వైద్యాధికారి డాక్టర్ వెంకటరమణ హుజురాబాద్ డిప్యూటీ డి ఎం హెచ్ ఓ డాక్టర్ చందు ఆదేశాల మేరకు వావిలాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని వావిలాల గ్రామంలోని అంగన్వాడీ కేంద్రములలో, ప్రాథమిక పాఠశాలలోనీ పిల్లలకి, విద్యార్థులకు అతి సార వ్యాది నిరోధక అవగాహన కార్యక్రమము హెల్త్ ఎడ్యుకేటర్ మోహన్ రెడ్డి నిర్వహించారు అనంతరం హెల్త్ ఎడ్యుకేటర్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ వర్షా కాలం ప్రారంభమైనందున కలుషిత త్రాగు నీరు, అపరి శుభ్రత వాతావరణం వల్ల డ యేరియా ఇతర వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందువల్ల 5 సంవత్సరాలలోపు పిల్లలందరికి ఓ ఆర్ యస్ పాకెట్లు జింకు మాత్రలను ముందస్తు చర్యలో భాగంగా ఇవ్వడం జరుగుతుందనీ ఈ స్టాప్ డ యేరియా క్యాంపెయిన్ ప్రోగ్రాం వచ్చేనెల 31 వ తేది వరకు జరుగుతుందనీ డ యేరియా వ్యాది లక్షణాలు, తీసుకోవలసిన జాగ్రత్తల గూర్చి సీజనల్ వ్యాధులు వ్యాపించు విధానం, తీసుకోవలసిన జాగ్రత్తల గురించి వివరించారు. చేతుల పరిశుభ్రత, వ్యక్తి గత పరిశుభ్రత, పరిసరాల పరిశుభ్రత గురించి అవగాహన కల్పించి ప్రతి ఒక్కరూ ఈ కాలనుగుణ వ్యాధుల గురించి తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు ఈ కార్యక్రమములో సూపర్వైజర్ సదానందం,పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రాజు ఏఎన్ఎం రమ,అంగన్వాడీ టీచర్ హజరత్ పాఠశాల ఉపాధ్యాయులు శిరీష,ఆశా కార్యకర్త మణి, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Exit mobile version