హిందీ భాషా మాధుర్యాలను కాపాడాలి
– హిందీ సాహిత్య మంచ్ జిల్లా ప్రతినిధి గఫూర్ శిక్షక్
ప్రశ్న ఆయుధం – కామారెడ్డి
హిందీ భాష విశిష్టత ఎంతో గొప్పదని ప్రపంచ వేదికపై విశ్వభాషగావిరాజిల్లుతున్న హిందీ భాష మాధుర్యాలను తెలుసుకొని భాష అభివృద్ధికి పాటుపడాలని హిందీ సాహిత్య మంచ్ కామారెడ్డి జిల్లా ప్రతినిధి ప్రముఖ కవి, రచయిత గఫూర్ శిక్షక్ అన్నారు . మంగళవారం కర్షక్ బీఈడీ కళాశాలలో జరిగిన హిందీ సాహిత్య సమావేశంలో హిందీ భాష మహత్యాన్ని తెలిపే కరపత్రాలను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలోని ఎక్కువ ప్రజలు మాట్లాడే భాషగా హిందీ భాష
భారతదేశ సంస్కృతితో ముడిపడి ఉన్నదని, దేశాన్ని ఏకతా సూత్రంతో ముందుకు తీసుక వెళ్లే శక్తి అన్ని ప్రాంతాలకు సరి అయిన దిశా దశను ఏర్పాటు చేసే సామర్థ్యం హిందీ భాషకు ఉన్నదని, హిందీ భాషా సాహిత్యం ఎంతో ప్రాచీనమైనదని అనేకమంది కవులు, రచయితలు ఎన్నో రచనలను చేసి దేశ గౌరవాన్ని చాటి చెప్పారని, నేడు ప్రపంచంలోని అన్ని దేశాల్లో హిందీ భాష గౌరవించబడి ఆదరించబడుతున్నదన్నారు.
ప్రపంచ దేశాలు హిందీ భాషా విశిష్టతను తెలుసుకొని
హిందీ భాషను నేర్చుకుంటున్నాయని, అనేక రచనల అనువాదాలు హిందీలో జరుగుతున్నాయని, హిందీ భాష ప్రచారంలో ప్రపంచవ్యాప్తంగా అనేక సంస్థలు తమ భాగస్వామ్యాన్ని చూపుతున్నాయన్నారు.
అన్ని భాషలను సమ ఆదరణతో చూడవలసిన అవసరం ఉన్నదని ఈ సందర్భంగా హిందీ భాష సాహిత్య చరిత్రను తెలియజేశారు. హిందీ భాషా మహత్యాన్ని తెలిపే కరపత్రాల ఆవిష్కరణ కార్యక్రమంలో హిందీ సాహిత్య మంచ్ జిల్లా ప్రతినిధులు వంశీధర్, లింగం , శ్యామ్, రవి కిరణ్, ఆదినారాయణ, సుదర్శన్ నర్సింలు, రఫీ తదితరులు పాల్గొన్నారు.