మెనూ ప్రకారం మధ్యాహ్న భోజనం అందించాలి.

మెనూ ప్రకారం మధ్యాహ్న భోజనం అందించాలి.

 

కామారెడ్డి జిల్లా ప్రతినిధి

(ప్రశ్న ఆయుధం) జూన్ 28

 

పాఠశాలల్లో విద్యార్థులకు మెనూ ప్రకారం మధ్యాహ్న భోజనం అందించాలి అని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ఆదేశించారు. శనివారం జిల్లా కలెక్టర్ కామారెడ్డి మండలం చిన్న మల్లారెడ్డి జెడ్పిహెచ్ఎస్ పాఠశాలను సందర్శించి పాఠశాలలో తరగతి గదులను పరిశీలించి పదవ తరగతి విద్యార్థులకు కాసేపు గణితం బోధించారు. విద్యార్థులచే బోర్డు మీద లెక్కలు చేయించారు. పదవ తరగతి పరీక్షలలో 100 శాతం ఉత్తీర్ణత సాధించేలా ప్రతి విద్యార్థి పుస్తక పఠనంపై ప్రత్యేక దృష్టి సాధించి కష్టపడి చదవాలని సూచించారు. పాఠశాల మైదానం పరిశీలించి శారీరకంగా మానసికంగా, ఆరోగ్యంగా ఎదిగేందుకు చదువుతోపాటు ప్రతి విద్యార్థి క్రీడలలో తప్పక పాల్గొనాలని సూచించారు. ఉపాధ్యాయులు, పాఠశాల సిబ్బంది హాజరు రిజిస్టర్ ను పరిశీలించారు. ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, ఇతర సిబ్బంది సమయపాలన పాటిస్తూ విధులకు హాజరుకావాలని సూచించారు. మెనూ ప్రకారం విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించాలని, అలాగే సీజనల్ వ్యాధులు వ్యాప్తి చెందకుండా పాఠశాల పరిసర ప్రాంతాలను, టాయిలెట్స్ లను శుభ్రంగా ఉంచాలని తెలిపారు. అలాగే పాఠశాలలోని అందరి విద్యా ర్థులు స్కూల్ యూనిఫామ్ ధరించాలని సూచించారు. జిల్లా కలెక్టర్ వెంట జిల్లా విద్యాశాఖ అధికారి రాజు తదితరులు ఉన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment