Site icon PRASHNA AYUDHAM

ఫుడ్ పాయిజన్ కి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలి

IMG 20250622 WA1873

*ఫుడ్ పాయిజన్ కి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలి*

*ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు గంధసిరి జ్యోతి బసు*

*అస్వస్థకు గురైన విద్యార్థులకు పరామర్శ*

*మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని నర్సింగ్ కళాశాల విద్యార్థులు ఫుడ్ పాయిజన్ కి ,గురికావడానికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ మహబూబాబాద్ జిల్లా అధ్యక్షులు గందసిరి జ్యోతి బసు డిమాండ్ చేశారు.. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో మహబూబాబాద్ జనరల్ ఆస్పత్రిలో అస్వస్థకు గురైన విద్యార్థులను పరమర్శించారు‌… అనంతరం విద్యార్థుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఆస్పటల్ సూపర్డెంట్ ను ఎస్ఎఫ్ఐ నాయకులు కోరారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నర్సింగ్ కళాశాల విద్యార్థుల భోజనం పట్ల అధికారులు నిర్లక్ష్యం వల్లనే ఫుడ్ పాయిజన్ జరిగిందని అన్నారు.. ఫుడ్ పాయిజన్ పై తగు విచారణ జరిపించి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ మహబూబాబాద్ పట్టణ కార్యదర్శి గుండ్ల రాకేష్ జిల్లా నాయకులు గణేష్ మహేష్ వినోద్ ప్రమోద్ భవాని వనిత పాల్గొన్నారు*

Exit mobile version