Site icon PRASHNA AYUDHAM

హిందూ సంఘటిత శక్తిని చాటేలా…..దేశద్రోహుల వెన్నులో వణుకు పుట్టేలా…

Screenshot 2025 05 16 23 09 06 051

*హిందూ సంఘటిత శక్తిని చాటేలా…..దేశద్రోహుల వెన్నులో వణుకు పుట్టేలా…*

*‘‘హిందూ ఏక్తా యాత్ర’’ సంచలనం కాబోతోంది*

*యావత్ తెలంగాణకు స్పూర్తిగా నిలిచేలా కరీంనగర్ లో ‘ఏక్తా యాత్ర’ సక్సెస్ చేస్తాం*

*ప్రతి ఒక్క హిందువు ఈ యాత్రలో పాల్గొనాలి*

*కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ వ్యాఖ్యలు*

*కరీంనగర్ లో బీజేపీ శ్రేణులతో ‘హిందూ ఏక్తా యాత్ర’ సన్నాహక సమావేశం*

*లక్ష మందిదాకా యాత్రకు హాజరవుతారని అంచనా*

*ఇంటింటికీ వెళ్లి యాత్రకు ఆహ్వానించాలని నాయకులను కోరిన సంజయ్*

కరీంనగర్ లో ఈనెల 22న నిర్వహించబోయే ‘‘హిందూ ఏక్తా యాత్ర’’ తెలంగాణలో ఓ సంచలనం కాబోతోందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ వ్యాఖ్యానించారు. హిందువుల సంఘటిత శక్తి చాటేలా…..దేశద్రోహుల వెన్నులో వణుకు పుట్టేలా…. సంతూష్టీకరణ పేరుతో ఒక వర్గం ఓట్ల కోసం హిందువుల మధ్య విబేధాలు స్రుష్టిస్తూ ఓటు బ్యాంకు రాజకీయాలు చేసే నాయకుల చెంప చెళ్లుమనేలా ‘‘హిందూ ఏక్తా యాత్ర’’ను కనీవినీ ఎరగని రీతిలో నిర్వహిస్తామన్నారు. ‘‘హిందూ ఏక్తా యాత్ర రాజకీయ కార్యక్రమం కానేకాదు. ఇది ఒక పార్టీకి సంబంధించినది కాదు. హిందూ శక్తిని ప్రదర్శించే యాత్ర మాత్రమే. బొట్టు పెట్టుకునే ప్రతి ఒక్కరిదీ’’అని అన్నారు. కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని ప్రతి గ్రామం నుండి మండల కేంద్రాలదాకా, మున్సిపాలిటీ నుండి కార్పొరేషన్ దాకా గడప గడప నుండి హిందువులంతా యాత్రకు తరలిరావాలని పిలుపునిచ్చారు. బీజేపీ నాయకులంతా ఇంటింటికీ వెళ్లి ఈనెల 22న కరీంనగర్ లో నిర్వహించబోయే ‘హిందూ ఏక్తా యాత్ర’కు తరలిరావాలంటూ ఆహ్వానించాలని కోరారు.

కరీంనగర్ ఎంపీ కార్యాలయంలో ఈరోజు సాయంత్రం పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని బీజేపీ మండలాల అధ్యక్షులు, ఇంఛార్జీలు, ముఖ్య నాయకులు, మహిళా మోర్చా నాయకులతో ‘హిందూ ఏక్తా యాత్ర’ సన్నాహక సమావేశం నిర్వహించారు. కరీంనగర్, సిరిసిల్ల జిల్లాల అధ్యక్షులు గంగాడి క్రిష్ణారెడ్డి, రెడ్డబోయిన గోపి, మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ, మాజీ మేయర్ సునీల్ రావు, చెన్నమనేని వికాస్ రావు, గుగ్గిళ్ల రమేశ్, ఓదేలు, వాసాల రమేశ్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా బండి సంజయ్ ఏమన్నారంటే….

తెలంగాణ ఉద్యమంతో ప్రత్యేక రాష్ట్రం సిద్దించింది. ఇక మళ్లీ తెలంగాణ సెంటిమెంట్ తో రాజకీయాలు నడవవు. ఇప్పుడు జాతీయవాదులను, హిందువులందరినీ ఏకం చేయాల్సిన అవసరం వచ్చింది. పెహెల్ గాం ఘటనతో ఏం జరిగిందో అందరం చూసినం. ప్రతి ఒక్క హిందువు ఆ ఘటనను చూసి రగలిపోయారు. ఉగ్రవాదులతోపాటు పాకిస్తాన్ అంతు చూడాలని కోరుకున్నారు. ఆ తరువాత ఏం జరిగిందో మీ అందరికీ తెలుసు. ఇప్పుడు హిందువులందరినీ ఏకం చేయాల్సిన అవసరం ఏర్పడింది. హిందూ ఏక్తా యాత్ర ద్వారా హిందువులందరికీ సంఘటితం చేసే మహత్తర అవకాశం వచ్చింది. ఈనెల 22న కరీంనగర్ లో నిర్వహించబోయే ‘హిందూ ఏక్తా యాత్ర’ ద్వారా ఈ అవకాశం మనందరికీ వచ్చింది. కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని ప్రతి ఇంటికి వెళ్లండి. హిందూ ఏక్తా యాత్రకు ఆహ్వానించండి. అసలు ఏక్తా యాత్ర ఉద్దేశమేమిటి? హిందువులంతా ఐక్యంగా ఉండకపోతే ఏం జరిగే ప్రమాదముందో తెలియజేయాలి. యువతను, మహిళలను, విద్యార్థులను, కుల సంఘాలను, ప్రజా సంఘాలను, వ్రుత్తి సంఘాలను ఏకం చేయాలి. లక్ష మందికి తగ్గకుండా ర్యాలీలో పాల్గొనేలా ఏర్పాట్లు చేస్తున్నాం.

వరంగల్ లో పుజారిని హత్య చేస్తే హిందువులందరినీ ఏకం చేయడం ద్వారా ఆ తరువాత జరిగిన కార్పొరేషన్ ఎన్నికల్లో ఏకంగా 14 కార్పొరేటర్ స్థానాలను కైవసం చేసుకున్నాం. కరీంనగర్ లోనూ సత్తా చాటాం. మీ అందరికీ ఈ యాత్ర పేరుతో ప్రతి ఒక్కరినీ కలుసుకునే అవకాశం వచ్చింది. మీ నాయకత్వాన్ని ప్రూవ్ చేసుకునే సమయం వచ్చింది.ఇకపై కరీంనగర్ లో ఏ ఒక్క గల్లీ చూసినా కాషాయ జెండాలే కన్పించాలి. సర్పంచ్, ఎంపీటీసీ, కార్పొరేటర్ గెలవాలంటే కాషాయ జెండా పట్టాల్సిందే. కరీంనగర్ లో ఇప్పటికే కాషాయ వాతావరణం నెలకొంది. మనం చేయాల్సిందల్లా హిందువుల ఐక్యతను చాటి చెప్పడమే. హిందూ ఏక్తా యాత్ర పేరుతో అందివచ్చిన ఈ అవకాశాన్ని మీరంతా ఉపయోగించుకోవాలని, హిందువులందరినీ సంఘటితం చేయాలని కోరుతున్నా.

Exit mobile version