Site icon PRASHNA AYUDHAM

హిందూ ఐక్యతను చాటి చెప్పి బంగ్లాదేశ్ హిందువులకు మద్దతు తెలపాలి

Headlines 
  1. బంగ్లాదేశ్ హిందువులకు మద్దతు: కామారెడ్డిలో ర్యాలీకి పిలుపు
  2. ఇస్కాన్ స్వామీజీ అరెస్ట్ ను ఖండిస్తూ హిందూ ఐక్యతకు ర్యాలీ
  3. బంగ్లాదేశ్ హిందువుల దుస్థితి పై స్పందన: హిందూ ఐక్య వేదిక
  4. డిసెంబర్ 4న కామారెడ్డిలో హిందూ ఐక్య వేదిక ర్యాలీ
  5. బంగ్లాదేశ్ హిందువులపై దాడులు ఆపాలి: హిందూ నాయకుల విజ్ఞప్తి

హిందూ ఐక్య వేదిక నాయకులు

ప్రశ్న ఆయుధం న్యూస్, డిసెంబర్ 2, కామారెడ్డి :

హిందూ ఐక్యతను చాటి చెప్పి బంగ్లాదేశ్ హిందువులకు మద్దతు తెలపాలని హిందూ ఐక్య వేదిక నాయకులు

బంగ్లాదేశ్ లో గత కొంత కాలంగా హిందువులపై జరుగుతున్న దాడులకు నిరసనగా కామారెడ్డిలో బంగ్లాదేశ్ హిందువులకు మద్దతుగా ర్యాలీ నిర్వహిస్తున్నట్టు హిందూ ఐక్య వేదిక నాయకులు జిల్లా కేంద్రంలోని అయ్యప్ప ఆలయంలో జరిగిన విలేఖరుల సమావేశంలో తెలిపారు. ఈ సందర్భంగా వీహెచ్ పి జిల్లా అధ్యక్షుడు నిత్యానందం, అయ్యప్ప సేవా సమితి అధ్యక్షుడు గందే శ్రీనివాస్, పవన్ కుమార్ శర్మలు మాట్లాడుతూ… బంగ్లాదేశ్ హిందువులపై దాడులను నిరసిస్తూ, ఇస్కాన్ స్వామీజీ చిన్మయి ప్రభుదాస్ అరెస్టును ఖండిస్తూ, బంగ్లాదేశ్ లో హిందువులపై దాడులు ఆపాలని తెలియజేస్తూ, ఈ సందర్భంగా కామారెడ్డిలో ర్యాలీ నిర్వహించనున్నామని అన్నారు. కామారెడ్డి జిల్లా హిందూ ఐక్య వేదిక ఆధ్వర్యంలో డిసెంబర్ 4 న గాంధీ గంజ్ నుండి ఉదయం 10 గంటలకు ప్రారంభమై జిల్లా కేంద్రంలోని పుర వీధుల గుండా ర్యాలీ ఉంటుదని తెలిపారు. జిల్లా నలుమూలల నుండి హిందూ బంధువులు తరలి రావాలని పిలుపునిచ్చారు. హిందూ ఐక్యత చాటి చెప్పి బంగ్లాదేశ్ హిందువులకు మద్దతు తెలపాలని విజ్ఞప్తి చేశార

ఈ కార్యక్రమంలో ఐక్య వేదిక నాయకులు శ్రీకాంత్, భరత్, వెంకటస్వామి, శ్రీనివాస్, రవీందర్, ప్రవీణ్ , లింగారవ్, రాజు, సాయి తదితరులు పాల్గొన్నారు.

Exit mobile version