అంగరంగ వైభవంగా శ్రీ దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు..

మహాశక్తి ఆలయంలో అంగరంగ వైభవంగా శ్రీ దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు..

నవరాత్రి ఉత్సవాలు చివరి రోజు కావడంతో ఆలయానికి పోటెత్తిన భక్తులు, భవానీ స్వాములు.

భవానీ శరణు ఘోషతో మారుమ్రోగిన అమ్మవార్ల ఆలయం.

9వ రోజు మహిషాసురమర్దిని రూపంలో దుర్గమ్మ దర్శనం.

అమ్మవారికి పసుపు, కుంకుమతో అలంకరo.

భక్తుల తాకిడితో కిక్కిరిసిపోయిన ఆలయ ప్రాంగణం.

IMG 20241011 WA0103 scaled

IMG 20241011 WA0102 scaled

కరీంనగర్ మహాశక్తి ఆలయంలో శ్రీ దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు అంబరాన్ని అంటాయి. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారు శుక్రవారం ( 9 వ రోజు) శ్రీ మహిషాసురమర్దిని రూపంలో దర్శనమిచ్చారు. దేవీ దర్శనం కోసం ఉదయం నుంచి సాయంత్రం దాకా భక్తుల తాకిడితో ఆలయ ప్రాంగణం కిక్కిరిసిపోయింది. భవానీ మాత శరణు ఘోషతో ఆలయ ప్రాంగణం మారుమ్రోగింది. నవరాత్రి ఉత్సవాలు చివరి రోజు కావడంతో భక్తులు వేలాదిగా తరలివచ్చి అమ్మవార్లను దర్శించుకున్నారు.  కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం రుద్ర సహిత చండి హోమం నిర్వహించారు. అనంతరం సంజయ్ ప్రజా సమస్యలపై దృష్టి సారించారు. తనని కలవడానికి వచ్చిన పార్టీ శ్రేణులను కలిసి ముచ్చటించారు.అభిమానులతో సెల్ఫీలు దిగారు. సాయంత్రం ఆలయ అవరణలో నిర్వహించిన మహిషాసుర వద కార్యక్రమంలో పాల్గొననున్నారు.నవరాత్రి ఉత్సవాల్లో చివరి రోజు కావడంతో మంత్రి పొన్నం ప్రభాకర్, బీజేపీ జాతీయ నాయకులు అభయ్ పాటిల్ కాసేపట్లో మహాశక్తి అమ్మవార్లను దర్శించుకోనున్నారు. ప్రత్యేక పూజలు తర్వాత కేంద్రమంత్రి తో కలిసి దాండియా కార్యక్రమాన్ని వీక్షించనున్నారు. దాండియా కోసం మహిళలు, యువత అధిక సంఖ్యలో తరలిరావడంతో ఆలయ పరిసర ప్రాంతాలు రద్దీగా మారాయి.

Join WhatsApp

Join Now