*ఘనంగా శ్రీ సరస్వతీ మాత యజ్ఞం*
*కరీంనగర్ అక్టోబర్ 17 ప్రశ్న (ఆయుధం)*
స్థానిక కరినగరంలోని శ్రీ సరస్వతీ శిశు మందిర్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో ‘సరస్వతీ మాత యజ్ఞం’ ఘనంగా నిర్వహించారు డాక్టర్ నాళ్ల సత్య విద్యాసాగర్ – స్వప్న దంపతులు యజ్ఞంలో పాల్గొనగా శంకర్ ఆర్యన్ యజ్ఞం జరిపించారు ప్రతి మాసం పౌర్ణమి రోజున శ్రీ సరస్వతీ శిశు మందిర్ హై స్కూల్ లో యజ్ఞం ఉంటుందని దేశం కోసం, ధర్మం కోసం లోక కళ్యాణార్థం నిర్వహించే యజ్ఞంలో ఎవరైనా పాల్గొనవచ్చునని పాఠశాల ప్రధానాచార్యులు సముద్రాల రాజమౌళి తెలిపారు ఈ కార్యక్రమంలో పాఠశాల కార్యదర్శి ఇంజనీర్ కోల అన్నా రెడ్డి పుల్లల శ్యామ్ సమితి అధ్యక్షుడు డాక్టర్ చక్రవర్తుల రమణాచారి సమితి కార్యదర్శి ఎలగందుల సత్యనారాయణ సహ కార్యదర్శి కొండా గంగాధర్ రాపర్తి శ్రీనివాస్ తాటి రాజేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.