శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరీ మాతను దర్శించుకున్న మైనంపల్లి హన్మంతరావు

మెదక్/నర్సాపూర్, మే 8 (ప్రశ్న ఆయుధం న్యూస్): మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో శ్రీ శ్రీ శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరీ మాత విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవంలో అమ్మవారికి మల్కాజిగిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు, మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఆంజనేయులు గౌడ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ శ్రీనివాస్ గుప్త, మాజీ ఎంపీపీలు జ్యోతి సురేష్ నాయక్, లలిత నర్సింగ్, శ్రీనివాస్ గౌడ్, సీనియర్ నాయకులు మహిపాల్ రెడ్డి, నర్సాపూర్ పట్టణ అధ్యక్షుడు ఆంజనేయులు గౌడ్, నర్సాపూర్ మండల అధ్యక్షుడు మల్లేష్, కౌడ్డిపల్లి మండల అధ్యక్షుడు శ్రీనివాసరావు, రుస్తుంపేట మాజీ ఎంపిటిసి అశోక్, నర్సాపూర్ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ ఉదయ్ కుమార్, నర్సాపూర్ మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు విజయ్ యాదవ్, నర్సాపూర్ మండల మైనారిటీ సెల్ అధ్యక్షుడు అజ్మత్, మోహన్ దాస్ గౌడ్, నర్సింలు, నగేష్, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొనారు.

Join WhatsApp

Join Now

Leave a Comment