శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ చిత్రపటానికి పూలమాల
— మండల అధ్యక్షుడు వెల్మ సంతోష్ రెడ్డి
కామారెడ్డి జిల్లా తాడ్వాయి
(ప్రశ్న ఆయుధం) జూన్ 23
సోమవారం రోజున బలిదాన్ దివాస్ సందర్భంగా తాడ్వాయి మండలంలోని, బిజెపి పార్టీ కార్యాలయంలో, డాక్టర్ శ్యాం ప్రసాద్ ముఖర్జీ చిత్రపటానికి పూలమాలవేసి, నివాళులు అర్పించడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో వెల్మ సంతోష్ రెడ్డి, తాడ్వాయి మండల అధ్యక్షులు, మరియు లింగ రావు, వెంకట్ రావు, హోటల్ శ్రీను, నర్సారెడ్డి, డాక్టర్ శివుడు,
నర్సింలు, రాజిరెడ్డి, బాలాజీ , దత్తాత్రేయ, మహేష్, అచ్యుత్, శ్రీకాంత్, మరియు పార్టీ కార్యకర్తలు పాల్గొనడం జరిగింది.