Site icon PRASHNA AYUDHAM

శ్యామ ప్రసాద్ ముఖర్జీ ఆశయాల సాధనకై, కృషి, చేయాలి

IMG 20250623 WA0141

శ్యామ ప్రసాద్ ముఖర్జీ ఆశయాల సాధనకై, కృషి, చేయాలి

– ఒక దేశంలో ఒకే రాజ్యాంగం, ఒకే జండా ఉండాలన్నదే ఆయన ఆశయం

– కామారెడ్డి శాసన సభ్యులు కాటిపల్లి వెంకట రమణ రెడ్డి

 

కామారెడ్డి జిల్లా ప్రతినిధి

(ప్రశ్న ఆయుధం) జూన్ 23

భారతీయ జనసంఘ్ వ్యవస్థాపకులు డాక్టర్ శ్యామ ప్రసాద్ ముఖర్జీ వర్ధంతి (బలిదాన్ దివస్), సందర్భంగా బీజేపీ జిల్లా కార్యాలయంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు నీలం చిన్న రాజులు, అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో, ఆ మహనీయుని చిత్ర పటానికి, కామారెడ్డి శాసనసభ్యులు కాటిపల్లి వెంకటరమణ రెడ్డి, పూల మాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వెంకట రమణ రెడ్డి మాట్లాడుతూ జనసంఘ్ పార్టీ వ్యవస్థాపకుడు శ్యామా ప్రసాద్ ముఖర్జీ బలిదాన దివస్, (23-06-1953) ఈ సందర్భంగా ఆయనకు ఘనంగా నివాళులు అర్పిస్తూ వారిని స్మరించుకుంటూ,ఏక్ దేశ్ మ్ దో నిశాన్, దో ప్రధాన్, దో విధాన్ నహి చలేగా. నహీ చలేగా. ఈ నినాదం వినగానే మన కళ్ళముందు కదులుతారనీ, దేశ సమైక్యత కోసం ప్రాణాలర్పించిన మహానేత అని. 370 ఆర్టికల్ రద్దు చేయాలని ఉద్యమించిన మహానేత. ఆ ఉద్యమంలో అనుమానాస్పదస్థితిలో కాశ్మీర్ లో అసువులు బాశారనీ అన్నారు. నేటి ప్రధాని నరేంద్ర మోదీ 370 ఆర్టికల్ రద్దు చేసి ఆయన బలిదానానికి అంకితం చేశారని అన్నారు. ఈ కార్యక్రమంలోఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శిలు నరేందర్ రెడ్డి, మాజీ కౌన్సిలర్ లు నరేందర్ తదితరులు పాల్గొన్నారు.

Exit mobile version