గాయలకు సైతం లెక్కచేయని ఎస్ఐ..!!

*తలకు గాయమైనా.. నెత్తురు కారుతున్నా.. విధుల్లో కేయూ ఎస్సై రవీందర్.*

గ్రేటర్ వరంగల్ కాకతీయ యూనివర్సిటీ ఎస్సై బొజ్జ రవీందర్ తలకు గాయమై.. రక్తం కారుతున్న నిమజ్జనం విధుల్లో సేవలు అందించి భక్తుల మనసులు గెలిచాడు. 

గుండ్లసింగారం ముచ్చర్ల ఓఆర్ఆర్ వద్ద నిమజ్జనం సోమవారం రాత్రి డ్యూటీలో ఉండగా.. తెల్లవారుజామున 02 దాటాక తలకు దెబ్బతాకింది. సున్నితమైన ప్రాంతం కావడంతో టోపీ కింద గాయమైన ప్రాంతం నుంచి ముఖం మీదకు రక్తం కారడం మొదలయింది. అక్కడే ఉన్న పోలీస్, వివిధ శాఖల సిబ్బంది ఎస్సైని చూసి ఆందోళన చెందారు. తల గాయం కావడంతో సిటిలోని హాస్పిటల్ వెళ్లాలని సూచించారు. వెహికల్ తీశారు.కానీ.. అప్పటికే వినాయక విగ్రహాలు వరుసకట్టి ఉండటంతో.. ఆఫీసర్ నొప్పిని భరిస్తూ డ్యూటీలోనే ఉన్నాడు. రక్తం అలానే రావడంతో చివరకు దగ్గర్లో ఉన్న 108 సిబ్బంది ఫస్ట్ ఎయిడ్ అందించారు. మెడికల్ సిబ్బంది విశ్రాంతి తీసుకోమని వారిస్తున్నా వినకుండా ఎస్సై రవీందర్ 5-10 నిముశాల్లో మళ్ళీ విధుల్లోచేరి నిమజ్జనం ప్రశాంతంగా జరిగేలా చూశారు. అక్కడున్న భక్తుల హృదయాలు గెలిచాడు…

Join WhatsApp

Join Now