పేకాట స్థావరంపై సిద్దిపేట టాస్క్ ఫోర్స్, గజ్వేల్ పోలీసుల దాడి
*గజ్వేల్ నియోజకవర్గం ప్రతినిధి, డిసెంబర్ 30, ప్రశ్న ఆయుధం :*
గజ్వేల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గజ్వేల్ పట్టణం లక్ష్మీ ప్రసన్న కాలనీ శివారులో కొంతమంది వ్యక్తులు కలసి పేకాట ఆడుతున్నారని నమ్మదగిన సమాచారంపై సిద్దిపేట టాస్క్ ఫోర్స్ పోలీసులు, గజ్వేల్ పోలీసులు వెళ్లి సోమవారం రాతి రైడ్ చేశారు. ఈ సందర్భంగా ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. ఐదుగురు వ్యక్తులు పారిపోయారు. అదుపులోకి తీసుకుని వారి వద్ద నుండి 3,610 వేల రూపాయలు, మూడు మొబైల్ ఫోన్లు, మూడు మోటార్ సైకిళ్ళు స్వాధీనం చేసుకున్నారు. గజ్వేల్ పోలీసులు కేసు నమోదు చేసి పరిశోధన ప్రారంభించారు. ఈ సందర్భంగా టాస్క్ ఫోర్స్ అధికారులు, గజ్వేల్ పోలీసులు మాట్లాడుతూ గ్రామాలలో, పట్టణాలలో, ఫామ్ హౌస్ లలో, ఇళ్ళల్లో పేకాట, బహిరంగ ప్రదేశంలో జూదం మరే ఇతర చట్టవ్యతిరేకమైన కార్యక్రమాలు ఎవరైనా నిర్వహిస్తున్నట్లు తెలిస్తే లేదా ఎవరైనా చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నట్లు సమాచారం ఉంటే వెంటనే సిద్దిపేట టాస్క్ ఫోర్స్ అధికారుల నెంబర్లు 8712667445, 8712667446, 8712667447 లకు సమాచారం అందించాలని సూచించారు. సమాచారం అందించిన వారి పేర్లు గోప్యంగా ఉంచడం జరుగుతుందని పేర్కొన్నారు.