Site icon PRASHNA AYUDHAM

సింగరేణి ఈపీ ఆపరేటర్స్ పదోన్నతులు కల్పించాలి ఇతర సమస్యలు పరిష్కరించాలి

IMG 20250624 WA0413

ప్రశ్న ఆయుధం న్యూస్ జూన్ 24 కొత్తగూడెం డివిజన్ ఆర్ సి
హెచ్ఎంఎస్, ఐ ఎఫ్ టి యుల ఆధ్వర్యంలో కొత్తగూడెంలో జిఎం పర్సనల్ కవిత నాయుడుకి వినతి పత్రం అందజెశారు.
సింగరేణి వ్యాప్తంగా వివిధ ఓసీ గనులలో పనిచేస్తున్న ఈపి ఆపరేటర్ల పదోన్నతులకు సంబంధించి మరియు ఇతర సమస్యలు పరిష్కరించాలని కోరుతూ హెచ్ఎంఎస్ మరియు ఐ ఎఫ్ టి యు ల సంయుక్త ఆధ్వర్యంలో మంగళవారం నాడు కొత్తగూడెం హెడ్ ఆఫీస్ లో జిఎం పర్సనల్ ఐ ఆర్ అండ్ పిఎం కవితా నాయుడుకి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా హెచ్ఎంఎస్ నాయకులు ఎండి రియాజ్ అహ్మద్, గోదావరి లోయ బొగ్గు గని కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు యస్ డి నా సర్ పాషా మాట్లాడుతూ కొత్తగూడెం రీజియన్ స్థాయి ఈ పీ ఆపరేటర్లకు సంబంధించి ఏ గ్రేడ్ పదోన్నతుల ఆర్డర్స్ లెటర్లు అభ్యర్థులకు ఇవ్వడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. అదేవిధంగా హయ్యర్ గ్రేడ్ ఆపరేటర్లకు పదోన్నతులు ఇచ్చిన వెంటనే మాకు కూడా సీ గ్రేడ్ పదోన్నతులు ప్రక్రియ ప్రారంభం అవుతుందని సింగరేణి వ్యాప్తంగా వేయికళ్లతో ఎదురుచూస్తున్నటు వంటి జూనియర్ ఆపరేటర్లకు కూడా సకాలంలో పదోన్నతులు ఇచ్చి ప్రోత్సహించాల్సి ఉంది దీనికై డి గ్రేడ్ లో రెండు సంవత్సరాల సర్వీస్ పూర్తి చేసి అర్హులైన ఆపరేటర్ల ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయడంతో పాటు జాప్యం చేయకుండా సి గ్రేడ్ పదోన్నతులు ఇవ్వాలని కోరారు, కొత్తగూడెం రీజియన్ స్థాయి బి మరియు స్పెషల్ గ్రేడ్ పదోన్నతుల ఆర్డర్స్ త్వరిత గతిన ఇవ్వాలి మణుగూరులో డి గ్రేడ్ పదోన్నతుల అర్హత పరీక్షలలో డిస్ క్వాలిఫైడ్ అయి తిరిగి రీ టెస్టులో క్వాలిఫైడ్ అయిన ఐదుగురికి మార్చి ముప్పై ఒకటి నుంచి బ్యాక్ డేట్ ఇచ్చి న్యాయం చేయాలి, ఈపి ఆపరేటర్ల సూటబుల్ జాబ్ సమస్యను పరిష్కరించాలి , కొత్తగూడెం రీజియన్ నుండి గోదావరిఖనికి వివిధ శిక్షణల నిమిత్తం టిటిసి వెళ్లే వారికి రానుబోను ఓడి ఇవ్వాలి ఈ కార్యక్రమంలో నాయకులు
వైఆంజనేయులు, అనిల్ రెడ్డి, సారయ్య, ఎండి రకీబ్, ఎండి ఆసిఫ్ పాషా, ఎండి షబ్బీర్ పాషా, రమణ, జక్కుల నారాయణ తదితరులు పాల్గొన్నారు.

Exit mobile version