సింగరేణి సోలార్ విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులకు హక్కులు కనీస వేతనాలు అమలు చేయాలి

ప్రశ్న ఆయుధం న్యూస్ జూన్ 27 కొత్తగూడెం డివిజన్ ఆర్ సి
ఐ ఎఫ్ టి యు ఆధ్వర్యంలో లేబర్ ఎన్ ఫోర్స్ మెంట్ సెంట్రల్ కొత్తగూడెం నల్లా శంకర్ కి వినతిపత్రం అందజేశారు.
సింగరేణి వ్యాప్తంగా సింగరేణి సోలార్ విద్యుత్ ప్లాంట్లలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ వర్కర్లకు సెక్యూరిటీ గార్డులకు చట్టబద్ధ హక్కులు కల్పించాలని కనీస వేతనాలు అమలు చేయాలని సంక్షేమ పథకాలు వర్తింపజేయాలని డిమాండ్ చేస్తూ సింగరేణి కాలరీస్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ఐ ఎఫ్ టి యు ఆధ్వర్యంలో సింగరేణి సోలార్ విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులు శుక్రవారం నాడు కొత్తగూడెం కేంద్ర కార్మిక శాఖ కార్యాలయంలో లేబర్ ఎన్ ఫోర్స్ మెంట్ ఆఫీసర్ (ఎల్ ఈ ఓ సెంట్రల్)నల్లా శంకర్ గారికి సోలార్ విద్యుత్ ప్లాన్ కాంట్రాక్ట్ కార్మికుల సంతకాల సేకరణతో కూడిన వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఐ ఎఫ్ టి యు అనుబంధ సింగరేణి సోలార్ విద్యుత్ ప్లాంట్ కాంట్రాక్ట్ కార్మిక సంఘం మణుగూరు ఏరియా ప్రధాన కార్యదర్శి చల్లా కాంతారావు మాట్లాడుతూ తమ సమస్యలు పరిష్కరించాలని సింగరేణి వ్యాప్తంగా సింగరేణి విద్యుత్ లలో అనేకమంది కాంటాక్ట్ కార్మికులు పనిచేస్తున్నారని వీరికి చట్టబద్ధ హక్కులు అమలు చేయడం లేదని కనీస వేతనాలు సంక్షేమ పథకాలు కూడా వర్తింప చేయడం లేదని కేంద్ర కార్మిక శాఖ సింగరేణి యాజమాన్యం స్పందించి తమ సమస్యలు పరిష్కరించాలని తమను కూడా కాంట్రాక్ట్ కార్మికులుగా గుర్తించాలని వారు కోరారు ఈ కార్యక్రమంలో వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment