Site icon PRASHNA AYUDHAM

జిఎం సివిల్ గా పదోన్నతి పై వెళ్తున్న ధనసరి వెంకటేశ్వర్లుకు *ఘనంగా సత్కరించిన సింగరేణిజీఎం సివిల్ రైల్వే కాంట్రాక్ట్ కార్మికులు*

IMG 20250530 WA0249

ప్రశ్న ఆయుధం న్యూస్ మే 30 కొత్తగూడెం డివిజన్ ఆర్ సి
మణుగూరు ఏరియా సివిల్ విభాగంలో వివిధ హోదాలలో పనిచేసి జిఎం సివిల్ గా కొత్తగూడెం బదిలీపై వెళుతున్న ధనసరి వెంకటేశ్వర్లుని మణుగూరు ఏరియా సింగరేణి సివిల్ రైల్వే కాంట్రాక్ట్ కార్మికులు గురువారం నాడు ఆయన కార్యాలయంలో గౌతమ బుద్ధుని ప్రతిమను అందజేసి శాలువా తో ఘనంగా సత్కరించి తమ అభిమానాన్ని చాటుకున్నారు.ఈ సందర్భంగా సింగరేణి సివిల్ కాంట్రాక్ట్ కార్మిక నాయకులు అంగోత్ మంగీలాల్, కుంటా రవి లు మాట్లాడుతూ రెండు వేల పదిహేనులో సివిల్ యస్ ఈ గా మణుగూరులో బాధ్యతలు చేపట్టి అనంతరం డిజిఎం మరియు ఏజీఎం సివిల్ గా పదోన్నతులు సాధించి కొత్తగూడెం హెడ్ ఆఫీస్ సివిల్ చీఫ్ గా పదవీ బాధ్యతలు చేపట్టబోతున్న సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. మణుగూరులో సింగరేణి ఉద్యోగులతో ఆయన మమేకమై పనిచేశారని పలు సేవా కార్యక్రమాలునిర్వహించడంతోపాటు ఏరియాలో సింగరేణి యాజమాన్యం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అనేక కొత్త నిర్మాణాలకు, అంతర్గత రోడ్లు సకాలంలో నాణ్యతతో కూడిన పనులు పూర్తి చేయటంలో సింగరేణి సామాజిక బాధ్యతలో భాగంగా సి ఎస్ ఆర్ నిధులతో సింగరేణి నిర్వాసిత మరియు ప్రభావిత
గ్రామాలఅభివృద్ధి పనులు సకాలంలో పూర్తి చేయడంలో వివిధ ఫంక్షన్ హాల్ నిర్మాణాలు సకాలంలో ప్రారంభించి పూర్తి చేయడంలో స్థానిక పాఠశాలలకు ఎంతో విలువైన ఫర్నిచర్ అందజేయడంలో గోదావరి వరద ముంపు గ్రామాలకు సింగరేణి సహకారం అందజేయడంలో కరోనా సమయంలో ఎన్నో సేవా కార్యక్రమాలలో ఏరియా జిఎం లకు ఆయన వెన్నుదన్నుగా నిలిచారని అన్నారు. అదేవిధంగా ఏరియా సింగరేణి కాంటాక్ట్ కార్మికులకు సంబంధించి ఎప్పటికప్పుడు సీఎం పిఎఫ్ లెక్కలు చూపటంలో అన్ని విభాగాల కాంట్రాక్ట్ కార్మికులకు ఏదైనా కష్టం వస్తే నేనున్నానని ఆదుకోవడంలో ధనసరి వెంకటేశ్వర్లు గారి పాత్ర ప్రశంసనీయమని వారు కొనియాడారు. సింగరేణి సివిల్ చీఫ్ గా సింగరేణి వ్యాప్తంగా కాంట్రాక్ట్ కార్మికులకు అన్ని విధాలుగా మేలు జరగనున్నదని వారు ఆకాంక్షించారు. సన్మాన గ్రహీత ధనసరి వెంకటేశ్వర్లు గారు మాట్లాడుతూ తన ఈ స్థాయికి ఎదగటానికి తల్లి సింగరేణి కారణమని అలాగే మణుగూరు అంటే తమకు మన ఊరు గానే భావిస్తాననీ ఈ ప్రాంత సింగరేణి ఉద్యోగులు, కాంట్రాక్ట్ కార్మికులు కాంట్రాక్టర్లు భూ నిర్వాసితులు ప్రజలు తనకు అంతటి గౌరవాన్ని ఆప్యాయతను పంచారని వారికి ఎంతగానో రుణపడి ఉంటానని అన్నారు. తనకు అన్ని విధాలుగా ప్రోత్సహించిన ఏరియా జిఎం దుర్గం రాంచందర్ గారికి సహకరించిన అధికారులకు, సివిల్ సిబ్బందికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కుంట రవికుమార్,జి నాగేశ్వరరావు,
కే గురుమూర్తి, వి శంకర్,ఎం సాంబశివరావు,జి సాయికుమార్, ఏ వినయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Exit mobile version