Site icon PRASHNA AYUDHAM

సామాజిక కార్యకర్త నాగుల జ్యోతికి జ్యోతిబాపూలే రాష్ట్ర స్థాయి మహిళా ప్రతిభ పురస్కారం

IMG 20250103 WA0319

ప్రశ్న ఆయుధం న్యూస్ జనవరి 3 భద్రాద్రి, కొత్తగూడెం జిల్లా ఆర్ సి
మణుగూరు మండలం న్యూ పద్మగూడం బీసీ కాలనీకి చెందిన నాగుల జ్యోతికి రాష్ట్ర తెలంగాణ ప్రభుత్వ, జ్యోతిబాపూలే ఉత్సవ కమిటీ మరియు బీసీ సంక్షేమ సంఘం శుక్రవారం నాడు హైదరాబాద్ రవీంద్రభారతిలో సంయుక్తంగా నిర్వహించిన జ్యోతిబా ఫూలే నూట తొంభై నాల్గవ జయంతిని పురస్కరించుకొని అత్యంత ప్రతిష్టాత్మక జ్యోతిబా ఫూలే రాష్ట్రస్థాయి పురస్కారాన్ని అతిథులు ఆహ్వానితుల, బంధువుల నడుమ ఘనంగా జ్యోతికి అవార్డును అందజేశారు. కార్యక్రమానికి రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి సీతక్క ముఖ్య అతిథిగా పాల్గొనగా తెలంగాణ రాష్ట్ర జ్యోతిబాపూలే ఉత్సవ కమిటీ చైర్ పర్సన్ బి మణి మంజరి సాగర్ చేతుల మీదుగా జ్యోతి అవార్డును అందుకున్నారు. ఈ సందర్భంగా మణి మంజరి మంజూరు సాగర్ మాట్లాడుతూ పద్మ గూడెం బీసీ కాలనీకి చెందిన నాగుల జ్యోతి సత్యార్థి ఫౌండేషన్ వారు నిర్వహిస్తున్న యాక్షన్ ఫర్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ప్రాజెక్టులో సామాజిక కార్యకర్తగా బాల్య వివాహాల వ్యతిరేక, బాల కార్మికుల వ్యతిరేక, మహిళలపై వేధింపులకు వ్యతిరేకంగా పలు ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజల్లో అవగాహన కల్పించడానికి ఎంతగానో కృషి చేస్తుందని ఆ విధంగా మణుగూరు ప్రాంతంలో ఎంతగానో గుర్తింపు పొందిందని ఆమె సేవలను గుర్తించి మహిళా ప్రతిభ రాష్ట్ర స్థాయి పురస్కానీ అందజేస్తున్నామని ఆమె తెలిపారు. అవార్డు గ్రహీత నాగుల జ్యోతి మాట్లాడుతూ తమ సేవలను గుర్తించిన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి మంత్రివర్యులకు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేకించి సీతక్కకు, పినపాక శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లుకి,జ్యోతిబా ఫూలే ఉత్సవ కమిటీకి, తనకు అన్ని విధాలుగా అండతండాలనిపిస్తున్న కైలాష్ ప్రత్యార్థి ఫౌండేషన్ వారికి, సింగరేణి సేవా సమితి వారికి మణుగూరు మండల ప్రజలకు పాత్రికేయులకు, బంధుమిత్రులకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. భారతదేశ తొలి ఉపాధ్యాయురాలు జ్యోతిబాపూలే తనకెంతో స్ఫూర్తి అని ఆమె జయంతి రోజునే తనకు పురస్కారం లభించడం ఎంతగానో సంతోషాన్ని కలిగించిందని అది కూడా ఎందరో సామాజిక కార్యకర్తలకు కళాకారులకు కలల సౌధం హైదరాబాద్ రవీంద్రభారతిలో అవార్డు అందుకోవటం మరింత గర్వంగా భావిస్తున్నానని ఆమె తన అనుభూతిని వ్యక్తం చేశారు. ఈ పురస్కారం తన బాధ్యతను మరింత పెంచిందని అన్నారు.ఈ అవార్డును తన భర్త స్వర్గీయ నాగుల నరేష్ కి అంకితం ఇస్తున్నట్లుగా ఆమె తెలిపారు. జ్యోతి రాష్ట్ర పురస్కారం అందుకోవటం పట్ల సింగరేణి సేవా సమితి సభ్యులు యస్ డి నా సర్ పాషా చర్వాణిలో జ్యోతితో మాట్లాడారు. జ్యోతి మణుగూరు ఏరియాలో ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలలో చురుకైన కార్యకర్తగా పనిచేస్తూ బాలల హక్కులకై కారు చీకట్లను పారద్రోలే వెలుగు జ్యోతి ఐ వికాసిస్తోందని ఆయన ప్రశంసించారు , ఈ సందర్భంగా జ్యోతి కి శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో పలువురు రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, జ్యోతిబా ఫూలే ఉత్సవ కమిటీ సభ్యులు, సామాజిక కార్యకర్తలు పాల్గొన్నారు.

Exit mobile version