*రైతుల సమస్యలను పరిష్కరించండి*
*చేనేత పద్మ సమైక్య రాష్ట్ర ఉపాధ్యక్షుడు సిలివేరు శ్రీకాంత్*
*జమ్మికుంట వీణవంక జూన్ 16 ప్రశ్న ఆయుధం*
రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన భూభారతి లో రైతులు ఇచ్చిన దరఖాస్తులను పరిశీలించి వారి సమస్యలు పరిష్కరించాలని వీణవంక తాసిల్దార్ అంబటి రజితను చేనేత పద్మ సమైక్య రాష్ట్ర ఉపాధ్యక్షుడు సిలివేరు శ్రీకాంత్ కోరారు. గురువారం వీణవంక తహసిల్దార్ కార్యాలయంలో ఆమెను కలిసి పూల మొక్కను అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. మండల వ్యాప్తంగా రైతులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను తహసిల్దార్ దృష్టికి తీసుకెళ్లగా, ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు నియమ నిబంధనలు పాటిస్తూ రైతుల సమస్యలను పరిష్కరిస్తారని హామీ ఇచ్చినట్లు శ్రీకాంత్ పేర్కొన్నారు శ్రీకాంత్ వెంట సగర సంఘం జిల్లా అధ్యక్షుడు దేవునూరు శ్రీనివాస్ ఉన్నారు