Headlines in Telugu:
-
శ్రీగురుపీఠంలో ప్రత్యేక పూజలు: దత్తాత్రేయ స్వామికి మహాపూజలు
-
గూడూరు గ్రామంలో శ్రీగురుపీఠం పూజలు: భక్తుల సమావే
-
శివ్వంపేట: శ్రీగురుపీఠంలో దత్తాత్రేయ స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహణ
శివ్వంపేట ప్రతినిధి నవంబర్ 19 (క్విక్ టు డే న్యూస్)
మెదక్ జిల్లారాష్ట్రంలోనే ఆధ్యాత్మికతకు మారుపేరుగా వెలుగొందబోతున్న మెదక్ జిల్లా శివ్వంపేట మండల పరిధిలోని గూడూరు గ్రామంలో గ్రామానికి చెందిన స్వర్గీయ పెద్దగోని జిన్నారం పెద్దగోని అంజమ్మ – లింగయ్య గౌడ్ పుణ్య దంపతుల కుమారుడు బగలాముఖీ ట్రస్ట్ సభ్యులు, హైకోర్టు సీనియర్ న్యాయవాది శ్రీగురుపీఠం ట్రస్ట్ పౌండర్ చైర్మన్ ప్రముఖ సంఘ సేవకులు జిన్నారం పెద్దగోని శివకుమార్ గౌడ్- రమాదేవి దంపతుల ఆధ్వర్యంలో గూడూరు గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న శ్రీగురుపిఠంలోని బాలాలయంలో మంగళవారం నేడు దత్తాత్రేయ స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది . ప్రత్యేక పూజలలో భాగంగా శ్రీగురుపీఠం ప్రధాన అర్చకులు వంశీకృష్ణ ఆధ్వర్యంలో బుధవారం రోజు స్వామివారికి మహా పూజలు నిర్వహించడం జరిగినది. ఈసందర్బంగా వంశీకృష్ణ మాట్లాడుతూ నేడు దత్తాత్రేయ స్వామి సాయిబాబా. సుబ్రహ్మణ్యం స్వామి. వెంకటేశ్వర స్వామి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది ఇందులో భాగంగా ఆవు పాలు నెయ్యి తోవిగ్రహాలకు అభిషేకం హారతి నిర్వహించడం జరిగిందని. ప్రతిరోజు పూజా కార్యక్రమంలో ఉంటాయని భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని ప్రధాన అర్చకులు వంశీకృష్ణ తెలిపారు ఈ కార్యక్రమంలో జిన్నారం సూర్య కుమార్ గౌడ్. కె.సత్యనారాయణ గౌడ్. . బ్రహ్మచారి. భానూరి గోనయ్య గౌడ్.మల్లయ్య గొల్ల అంజయ్య భక్తులు పాల్గొన్నారు