Site icon PRASHNA AYUDHAM

శని త్రయోదశి సందర్భంగా అడిషనల్ కలెక్టర్ ప్రత్యేక పూజలు

IMG 20241228 WA0002 1

ప్రశ్న ఆయుధం న్యూస్ డిసెంబర్ 21 (మెదక్ ప్రతినిధి శివ్వంపేట మండలం)

మెదక్ జిల్లా శివ్వంపేట మండలంలోని చాకరిమెట్ల శ్రీ సహకార ఆంజనేయస్వామి ఆలయంలో శనివారం మరియు శని త్రయోదశి సందర్భంగా  భక్తజన సందడి నెలకొంది. ఉదయం నుంచి వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులు మరియు అడిషనల్ కలెక్టర్ నాగేష్  స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ పూజారులు అభిషేకం, ప్రత్యేక పూజలు ప్రత్యేక హారతి నిర్వహించారు. అనంతరం పక్కనే ఉన్న రామాలయంలో సీతారాముల వారికి అభిషేకం, ప్రత్యేక పూజలు ప్రత్యేక హారతి నిర్వహించారు. సత్యనారాయణ స్వామి మండపంలో భక్తులు సామూహిక వ్రతాలు ఆచరించారు. దాతల సహకారంతో అన్నదానం చేపట్టారు.

పూజలు చేస్తున్న అడిషనల్ కలెక్టర్ కుటుంబ సభ్యులు

 

భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూశామని ఈఓ సార శ్రీనివాస్ తెలిపారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ నాగేష్ మాట్లాడుతూ సహకార ఆంజనేయ స్వామి వారిని దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉందని అన్నారు ఈ కార్యక్రమంలో ఆలయ ఫౌండర్, చైర్మన్ ఆంజనేయశర్మ ప్రధాన అర్చకులు దేవదత్తశర్మ, ప్రభుశర్మ, దేవిశ్రీ, శ్రీహర్ష శ్రీ చరణ్ శ్రీ వత్సవా శర్మ సిబ్బంది రామకృష్ణ. పాల్గొన్నారు.

Exit mobile version